ప్రజా సమస్యలు గాలికొదిలేసి అవినీతి సొమ్ముకోసం ఎంపీపీ బాసని రమాదేవి, ఎంపీడీఓ బానోతు భద్రునాయక్ ...
శాయంపేట : ప్రజా సమస్యలు గాలికొదిలేసి అవినీతి సొమ్ముకోసం ఎంపీపీ బాసని రమాదేవి, ఎంపీడీఓ బానోతు భద్రునాయక్ వాదులాడుకోవడం సిగ్గుచేటని టీడీపీ మండలాధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు.
శుక్రవారం మండలకేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి సమస్యలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ రుణాల జాబితా ఎంపికలో అన్యాయం జరిగిందని, అవేమి పట్టించుకోకుండా ఇలా మండలంలో ఉన్నతస్థానంలో ఉండి ఇలా వాదులాడుకోవడం సరైందికాదన్నారు. టీడీపీ మండల ప్రధానకార్యదర్శి వైనాల కుమారస్వామి, రాజిరెడ్డి, తడక కుమారస్వామి, రమేశ్, చిందం రవి, పాల్గొన్నారు.