పిచ్చికుక్క దాడి : ఐదుగురికి తీవ్రగాయాలు | Sakshi
Sakshi News home page

పిచ్చికుక్క దాడి : ఐదుగురికి తీవ్రగాయాలు

Published Sun, Mar 6 2016 10:05 AM

పిచ్చికుక్క దాడి : ఐదుగురికి తీవ్రగాయాలు - Sakshi

ఖానాపూర్: ఆదిలాబాద్ జిల్లాలో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ఖానాపూర్లోని పలు కాలనీల్లో ఆదివారం ఉదయం ఓ పిచ్చికుక్క స్థానికులను కరించింది. దీంతో ఐదుగురి బాధితులకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక అసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. పిచ్చికుక్కను పట్టుకోవడంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Advertisement
Advertisement