ఏడాదిన్నర చిన్నారికి కరోనా

Five Members Positive Cases Filed in Vanasthalipuram - Sakshi

ఒకే కుటుంబంలో నలుగురికి సోకిన వైరస్‌

జిల్లాలో 94కు చేరుకున్న కోవిడ్‌ బాధితులు

సాక్షి, రంగారెడ్డి జిల్లా: మరోసారి కోవిడ్‌ పంజా విసిరింది. శుక్రవారం ఒక్కరోజే ఐదుగురికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో 18 నెలల బాబు ఉండటం ఆందోళన కలి గిస్తోంది. ఈ కేసులన్నీ వనస్థలిపురం హు డాసాయికి కాలనీకి చెందినవే. ఈ ఐదుగురిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. వీరిలో భార్యాభర్తలతోపాటు 11 ఏళ్ల కూతురు, 8 ఏళ్ల కుమారుడు ఉన్నారు. ఇప్పటికే పాజిటివ్‌గా వచ్చిన ఓ వ్యక్తి ఇంట్లో ఈ కుటుంబం అద్దెకు ఉంటోంది. ఈ ఇంట్లోనే పనిచేస్తున్న ఓ మహిళకు చెందిన ఏడాదిన్నర బాబుకూ వైరస్‌ వ్యాప్తి చెందింది. వీరందరినీ నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వరుసగా కేసులు నమోదవుతుండటంతో వనస్థలిపురం వాసులు భయం గుప్పిట్లో మగ్గుతున్నారు. 

యాక్టివ్‌ కేసులు
తాజా కేసులతో కలుపుకుంటే జిల్లాలో కోరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 94కు చేరుకుంది. వీరిలో 47 మంది కోలుకుని ఇళ్లకు చేరగా.. నలుగురు ప్రాణాలు విడిచారు. మిగిలిన 43 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. వీరంతా గాంధీలో చికిత్స పొందుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top