ఆర్టీసీ బస్సు, కారు డీ: ఐదుగురికి తీవ్రగాయాలు | five injured in road accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీబస్సు, కారు డీ: ఐదుగురికి తీవ్రగాయాలు

Apr 3 2015 11:12 PM | Updated on Aug 30 2018 3:56 PM

మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండలం కమాల్‌పూర్ స్టేజీ సమీపంలో దేవరకొండ - కల్వకుర్తి ప్రధాన రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

వంగూరు:మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండలం కమాల్‌పూర్ స్టేజీ సమీపంలో దేవరకొండ - కల్వకుర్తి ప్రధాన రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని కొత్తూరు మండలం హెచ్‌ఏఎల్ కంపెనీ ఉద్యోగులు కారులో దేవరకొండవైపు వెళుతుండగా కమలాపూర్ స్టేజీ సమీపంలో ఎదురుగా వచ్చిన కల్వకుర్తి ఆర్టీసీ డిపో బస్సు ఢీకొంది.

 

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న విరీష్, విద్యాసాగర్, సూడామన్, మనోజ్, నరేష్‌లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 వాహనంలో కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మనోజ్, విద్యాసాగర్, సూడామన్‌ల పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. కాగా, ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement