మహబూబ్నగర్ జిల్లా ధర్మాపూర్ వద్ద బుధవారం కారు - కర్ణాటక చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది.
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా ధర్మాపూర్ వద్ద బుధవారం కారు - కర్ణాటక చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు విజయవాడకు చెందిన వాసులని పోలీసులు తెలిపారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.