మరో యువరైతు ఆత్మహత్య | farmer suicide in adilabad district | Sakshi
Sakshi News home page

మరో యువరైతు ఆత్మహత్య

Dec 3 2015 11:58 AM | Updated on Oct 1 2018 2:36 PM

అప్పుల బాధ తాళలేక యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా కుంటాల మండలం సరియాపూర్ పంచాయతి పరిధిలోని మెద్దన్‌పూర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.

కుంటాల: అప్పుల బాధ తాళలేక యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా కుంటాల మండలం సరియాపూర్ పంచాయతి పరిధిలోని మెద్దన్‌పూర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నితీష్(25) తనకున్న ఎకరం భూమితో పాటు ఆరెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో.. మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నితీష్‌కు ఆరు నెలల క్రితమే వివాహమైంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement