ఎండిన పంటను చూసి ఆగిన రైతు గుండె | Farmer died with hartatak | Sakshi
Sakshi News home page

ఎండిన పంటను చూసి ఆగిన రైతు గుండె

Oct 3 2015 10:47 AM | Updated on Oct 1 2018 2:44 PM

ఎండిన పంటను చూసి ఓ రైతు గుండె ఆగింది.

ఎండిన పంటను చూసి ఓ రైతు గుండె ఆగింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా యాదిగిరిగుట్ట మండలం రాళ్లజనగామ గ్రామంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే...  గ్రామానికి చెందిన కందుకూరి బలవంతం(54) తనకున్న మూడెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో గత రెండే ళ్లుగా పంటలు సరిగా పండకపోవడంతో.. రూ. 5 ల క్షల అప్పులయ్యాయి. నిన్న సాయంత్రం పొలంలో పురుగుల మందు కొట్టిన అనంతరం ఎండిపోతున్న పంటను దిగులుగా చూస్తూ అక్కడే కూర్చుండిపోయిన రైతు.. గుండెపోటుతో  మృతి చెందాడు.  సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement