ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులవి తిరస్కరణ
మార్చి 2న ఉపసంహరణ
నల్లగొండ : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల మండలి ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన శుక్రవారం పూర్తయింది. ఈ స్థానానికి పోటీ చేసేందుకు మూడు జిల్లాల నుంచి 27మంది 47 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. వీటిలో ఎన్నికల నియమావళికి లోబడి నామినేషన్ల పరిశీలించిన పిదప 25మంది అభ్యర్థుల నామినేషన్లు ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హత సాధించాయి. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు వివిధ కారణాల దష్ట్యా తిరస్కరించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ వేసే అభ్యర్థిత్వాన్ని కనీసం పది మంది ఓటర్లు ప్రతిపాదించాలి. కానీ బి.కుమార్ (వరంగల్) నామినేషన్ ముగ్గురు ఓటర్లు మాత్రమే ప్రతిపాదించడంతో దానిని తిరస్కరించారు. అదే విధంగా ఎన్నికల మాన్యువల్ ఆర్టికల్ 173 (బీ) ప్రకారం పట్టభద్రుల స్థానానికి పోటీ చేసే అభ్యర్థి వయస్సు 30 ఏళ్లు ఉండాలి. కానీ ఎల్.చందులాల్ (వరంగల్) వయస్సు 27 ఏళ్లు మాత్రమే ఉండడంతో ఆ నామినేషన్ను తిరస్కరించారు.
నల్లగొండ జిల్లా నుంచే అధికం..
అర్హత సాధించిన నామినేషన్లలో అత్యధికంగా నల్లగొండ జిల్లానుంచే ఉన్నాయి. వీటిలో ప్రధాన పార్టీల నుంచి పోటీలో ఉన్న వారిలో తీన్మార్ మల్లన్న (కాంగ్రెస్), సూరం ప్రభాకర్రెడ్డి (వామపక్షాలు బలపర్చిన స్వతంత్ర అభ్యర్థి) నల్లగొండ జిల్లాకు చెందిన వారు. పల్లా రాజేశ్వరరెడ్డి, ఎర్రబెల్లి రామ్మోహన్రావు వరంగల్ జిల్లాకు చెందిన అభ్యర్థులు. అయితే ఈ అభ్యర్థులు నామినేషన్ పత్రంలో పేర్కొన్న చిరునామా, ఓటర్లు ఉన్న ప్రాంతాలు వేర్వేరు చోట్ల ఉన్నాయి. తీన్మార్ మల్లన్న తుర్కపల్లి మండలం మాదాపురం గ్రామంలో నివసిస్తున్నట్లు పేర్కొన్నారు. పల్లా రాజేశ్వర్రెడ్డి హైదరాబాద్లోని జూబ్లిహిల్స్, సూరం ప్రభాకర్రెడ్డి రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ చిరునామా పేర్కొన్నారు. రామ్మోహన్రావు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కళ్లెడ చిరునామా పేర్కొన్నారు.
మొత్తం దాఖలైన నామినేషన్లు - 27
ఎన్నికల్లో పోటీ కి అర్హత సాధించినవి - 25
ముగిసిన నామినేషన్ల పరిశీలన
Published Sat, Feb 28 2015 12:42 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement