తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టొద్దు: నోముల | elangana holding people together - trs leader nomula | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టొద్దు: నోముల

Jun 1 2014 1:23 AM | Updated on Jul 28 2018 6:33 PM

తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టొద్దు: నోముల - Sakshi

తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టొద్దు: నోముల

తెలంగాణలో ఆస్తులను పంచుకోలేదని చంద్రబాబునాయుడు రెచ్చగొడుతున్నారని, ఇది మంచిది కాదని టీఆర్‌ఎస్ నాయకుడు నోముల నర్సింహయ్య హెచ్చరించారు.

హైదరాబాద్: తెలంగాణలో ఆస్తులను పంచుకోలేదని చంద్రబాబునాయుడు రెచ్చగొడుతున్నారని, ఇది మంచిది కాదని టీఆర్‌ఎస్ నాయకుడు నోముల నర్సింహయ్య హెచ్చరించారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో ఆయన శనివారం మాట్లాడుతూ, అప్పులను మాత్రమే పంచుకున్నామని, ఇంకా ఆస్తులను పంచుకోవాల్సి ఉందంటూ రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అన్నారు. విడిపోయిన తర్వాత అన్నదమ్ములుగా కలసి అభివృద్ధి చెందేవిధంగా రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలుండాలన్నారు. సంబంధాలను చెడగొట్టే విధంగా వ్యవహరించడం మంచిది కాదన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement