తల్లి మరణం తట్టుకోలేక కూతురు మృతి | Daughter dies not to Tolerate mother's death | Sakshi
Sakshi News home page

తల్లి మరణం తట్టుకోలేక కూతురు మృతి

Dec 26 2014 2:59 AM | Updated on Sep 2 2017 6:44 PM

నవమాసాలు మోసి, కనిపెంచిన తల్లి మరణాన్ని ఆ కూతురు తట్టుకోలేక‘పోయింది’.

చింతపల్లి: నవమాసాలు మోసి, కనిపెంచిన తల్లి మరణాన్ని ఆ కూతురు తట్టుకోలేక‘పోయింది’. కళ్లెదుటే విగతజీవిగా పడి ఉన్న మాతృమూర్తి మృతదేహంపై పడి తనూ కూడా ప్రాణాలొదిలింది.. ఈ ఘటన నల్లగొండ జిల్లా చింతపల్లిలో గురువారం చోటు చేసుకుంది. చక్కని బక్కమ్మ(80)కు ఇద్దరు కుమారులు, కూతురు అంజమ్మ (60) ఉన్నారు. బక్కమ్మ తన పెద్ద కుమారుడు అంజయ్య వద్ద ఉంటోంది. కాగా, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బక్కమ్మ గురువారం మృతిచెందింది. విషయం తెలుసుకున్న అంజమ్మ.. తల్లి అంత్యక్రియలలో పాల్గొనేందుకు అత్తింటి నుంచి స్వగ్రామానికి వచ్చింది. తల్లి మృతదేహంపై పడి బోరున విలపిస్తూ ప్రాణాలు విడిచింది.
 

Advertisement
 
Advertisement
Advertisement