సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి సాకే శైలజానాథ్ను వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. శైలజానాథ్ తల్లి గంగమ్మ మృతి పట్ల సంతాపం తెలిపారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్న వైఎస్ జగన్.. శైలజానాథ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
సాకే శైలజానాథ్ ఇంట విషాదం నెలకొంది. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి సాకె గంగమ్మ ఈ ఉదయం(శుక్రవారం) కన్నుమూశారు. శైలజానాథ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గంగమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పని చేసిన సాకే శైలజానాథ్.. ప్రస్తుతం శింగనమల వైఎస్సార్సీపీ ఇంఛార్జ్గా ఉన్నారు.


