కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి | Contract labor regulations should | Sakshi
Sakshi News home page

కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి

Oct 13 2014 2:31 AM | Updated on Sep 2 2017 2:44 PM

కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించి వారిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని జిల్లాపరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ డిమాండ్ చేశారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని

కొండమల్లేపల్లి : కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించి వారిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని జిల్లాపరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ డిమాండ్ చేశారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ కొండమల్లేపల్లి డీఈ కార్యాలయం ఎదుట విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెకు ఆదివారం జెడ్పీ చైర్మన్ బాలునాయక్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు రోజులుగా కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరారు. రాష్ట్రంలో కరెంటు కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దీంతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని, కరెంట్ కొరతను తీర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ముత్తయ్య, జిల్లా అధ్యక్షుడు సురేష్, దేవరకొండ ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ్మ, వైస్ ఎంపీపీ వేణుధర్‌రెడ్డి, సిరాజ్‌ఖాన్, వెంకటేష్, దేవేందర్, లింగయ్య, ఎంపీటీసీలు కైలాసం, వస్కుల తిరుపతమ్మ కాశయ్య, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement