బాధితులకు జానారెడ్డి పరామర్శ | Sakshi
Sakshi News home page

బాధితులకు జానారెడ్డి పరామర్శ

Published Sun, May 8 2016 11:12 AM

CLP Leader Visitation to Rain Victims in nalgonda district

నల్గొండ: అకాల వర్షాలతో నష్టపోయిన బాధితులను సీఎల్పీ నేత జానారెడ్డి పరామర్శించారు. ఆదివారం నల్లగొండ జిల్లా అనుముల మండలం అల్వాల గ్రామంలో ఆయన పర్యటించారు. శుక్రవారం వచ్చిన భారీ గాలివానకు గ్రామంలో సుమారు 40 ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఆయా కుటుంబాల వారిని, రైతులను ఆయన పరామర్శించారు. ప్రభుత్వం నుంచి సాయం అందేలా కృషి చేస్తానని వారికి జానారెడ్డి హామీ ఇచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement