సిమెంట్ ధరలకు రెక్కలొచ్చాయి. రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. వర్షాకాలం కాబట్టి సహజంగా ఈ సీజన్లో సిమెంట్ ధరలు స్థిరంగా ఉండవచ్చని గృహనిర్మాణదారులు భావించారు. మార్కెట్ వర్గాలు సైతం ఊహించని విధంగా సిమెంట్ ధరలు ఒక్కసారిగా పెంచేశారు. సామాన్యుడు రెండు గదుల ఇల్లు నిర్మించుకునే పరిస్థితి లేకుండాపోయింది. వారం రోజుల్లో 70 నుంచి 80 రూపాయల వరకు పెరిగాయి. వారం రోజుల క్రితం రూ.200 నుంచి రూ.210కి విక్రయించిన సిమెం ట్ బస్తా ధర ప్రస్తుతం రూ.280కి చేరింది. పెరిగిన ధరల కారణంగా కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారితోపాటు ఏజెన్సీల వారు కూడా ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో 23 సిమెంట్ పరిశ్రమలు ఉన్నప్పటికీ ధరలు విపరీతంగా పెరగడానికి ఉత్పత్తి తగ్గిపోవడమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. గతంకంటే 50 శాతం సిమెంట్ ఉత్పత్తి మాత్రమే చేస్తున్నారు. ఉత్పత్తి తగ్గి వినియోగం పెరగడంతో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికితోడు ఇటీవల కాలంలో వివిధ సిమెంట్ కంపెనీ యజమానులు సిండికేట్ అయ్యి ధరలు అమాంతం పెంచినట్లు తెలుస్తోంది. హర్ఏక్మాల్ సరుకులు మాదిరిగా మార్కెట్లో ఏ కంపెనీ సిమెంట్ అయినా ఐదు, పది రూపాయలు మాత్రమే తేడా ఉంది. సిమెంట్ ధర తక్కువగా ఉందని నిర్మాణాలు మొదలు పెట్టిన వారు నిర్మాణ ఖర్చు మరింత భారమవుతుందేమోనని ఆందోళన చెందుతుండగా మరి కొందరు నిర్మాణాలు మొదలు పెటేందుకు జంకుతున్నారు. ఇంటి నిర్మాణాలు నిలిచితే మా బతుకులు ఎలాగని, పూట ఎలా గడుస్తుందని భవన నిర్మాణ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరో రెండు రోజుల్లో రూ.30 పెరిగే అవకాశం
మరో రెండు రోజుల్లో సిమెంట్ ధరలు బస్తాకు మరో రూ.30 పెరిగే అవకాశాలు ఉన్నాయి. ధరల పెరుగుదల కారణంగా ఇం డ్లు నిర్మించుకునే వారు తలలు పట్టుకోవడంతో వ్యాపారాలు సా గడం లేదని వ్యాపారస్తులు పేర్కొంటున్నారు. మరో 30 రూపాయలు పెరిగితే ఇళ్లు నిర్మించుకోవడానికి ఎవరూ ముందుకు రారని, వ్యాపారం సాగదని వ్యాపారస్తులు పేర్కొంటున్నారు.
వ్యాపారం చాలా తగ్గింది
గత నెలలో రోజుకు సుమారుగా 100 సిమెంటు బస్తాలను అమ్మెవారం. కానీ ఈ నెలలో సిమెంటు ధర విపరీతంగా పెరి గిపోవడంతో కొనుగోలు చేయడానికి ఇళ్లు నిర్మించుకునే వారు రావడం లేదు. దీంతో వ్యాపారం పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం రోజుకు అతికష్టంగా 30నుంచి 40బస్తాలు మాత్రమే అమ్ముడుపోతున్నాయి. మేస్త్రీలు పనులు కూడా చేయడం లేదు. ధరలు తగ్గితే తప్ప గిరాకీ వచ్చే అవకాశం లేదు.
- కండె రమణ, సిమెంటు షాపు నిర్వాహకుడు, మిర్యాలగూడ
ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు
సిమెంటు ధరలు విపరీతంగా పెర గడంతో సామాన్యులు ఇళ్లు కట్టుకునే పరిస్థితి లేదు. గత నెలకు ఈ నెలకు 75 రూపాయలు పెరగడంతో మరింత భారంగా మారింది. ఏ ప్రభుత్వం వచ్చినా సిమెంటు ధరలు పెంచడమే కానీ తగ్గేది లేదు. అప్పులు చేసి గూడు నిర్మించుకుంటున్నాను. ధరలు పెరగడంతో అప్పులు కూడా పెరుగుతాయి. ఇల్లు నిర్మాణం మధ్యలో ఉండడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో సిమెంట్ కొనుగోలు చేస్తున్నాను.
- చక్రాల ఆగయ్య, తోపుచర్ల
సిమెంట్ ధరలకు రెక్కలు
Published Sun, Jun 8 2014 12:50 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement