నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం ఎస్సారెస్పీ కాలనీలో శుక్రవారం ఉదయం పోలీసులు కార్డాన్ సెర్చ్ చేపట్టారు.
బాల్కొండ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం ఎస్సారెస్పీ కాలనీలో శుక్రవారం ఉదయం పోలీసులు కార్డాన్ సెర్చ్ చేపట్టారు. మొత్తం పది మంది ఎస్సైలు, ముగ్గురు సీఐలు, 100 మంది కాలిస్టేబుళ్లు ఇల్లిల్లూ గాలించారు. ఈ సందర్భంగా ఎలాంటి పత్రాలు లేని 15 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గాలింపు ఇంకా కొనసాగుతోంది.
అదేవిధంగా జిల్లాలోని గాంధారిలో పోలీసులు కార్డన్సెర్చ్ నిర్వహించారు. సీఐ, ఎనిమిది మంది ఎస్ఐలు సహా 50 మంది వరకూ పోలీసులు మండల కేంద్రంలోని ఇందిరానగర్తోపాటు సోమారం తండా, పంతులునాయక్ తండా, బూరుగల్ తదితర ప్రాంతాలలో సోదాలు నిర్వహించారు. పత్రాలు లేని 12 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు.