నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణంలో గురువారం ఉదయం పోలీసులు కార్డాన్సెర్చ్ చేపట్టారు.
కామారెడ్డిలో కార్డాన్ సెర్చ్
Jan 28 2016 8:29 AM | Updated on Oct 17 2018 6:06 PM
కామారెడ్డి: నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణంలో గురువారం ఉదయం పోలీసులు కార్డాన్సెర్చ్ చేపట్టారు. పట్టణ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దాదాపు 40 మంది పోలీసులు స్థానిక ఆర్బీనగర్లో సోదా జరిపారు. సరైన పత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలతో పాటు, 7 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీలు కొనసాగుతున్నాయి.
Advertisement
Advertisement