మీ ఇంట్లో ముగ్గురు మంత్రులు.. మా ఇంట్లో రెండు పింఛన్లు వద్దా ? | beedi workers fire on cm kcr | Sakshi
Sakshi News home page

మీ ఇంట్లో ముగ్గురు మంత్రులు.. మా ఇంట్లో రెండు పింఛన్లు వద్దా ?

May 28 2015 7:57 PM | Updated on Oct 1 2018 2:00 PM

సీఎం కేసీఆర్ ఇంట్లో ముగ్గురు మంత్రులు ఉండవచ్చు కానీ మా ఇంట్లో ఇద్దరికి పింఛన్ వస్తే తప్పవుతుందా .

హైదరాబాద్: " సీఎం కేసీఆర్ ఇంట్లో ముగ్గురు మంత్రులు ఉండవచ్చు కానీ మా ఇంట్లో ఇద్దరికి పింఛన్ వస్తే తప్పవుతుందా .." అంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. వివరాలు.. అఖిల భారత రైతు కూలీ సంఘం నిజామాబాద్ జిల్లా ఏడో మహాసభలు గురువారం సిరికొండ మండల కేంద్రంలో ప్రారంభమయ్యాయి. ఈ సభలో ప్రొఫెసర్ కోదండరాం ప్రసంగం ప్రారంభించగానే బీడీ కార్మికులు లేచి తమకు జీవనభృతి రావడం లేదంటూ వాపోయారు. ఒక్కొక్కరు మాట్లాడాలని సూచించగా.. గడ్కోల్ గ్రామానికి చెందిన ఓ బీడీ కార్మికురాలు మాట్లాడుతూ.. "కేసీఆర్ ఇంట్లో ముగ్గురికి పదవులు ఉండగా లేనిది..  తమకు ఒక ఇంట్లో ఇద్దరికి పింఛన్లు ఇస్తే ఏంపోతుంది" అని ప్రశ్నించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement