గణనాధుడి శోభాయాత్ర సందర్భంగా పోలీసుల తీరుకు నిరసనగా అఖిలపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా బంద్ కొనసాగుతోంది
కొనసాగుతున్న కామారెడ్డి బంద్
Sep 6 2017 1:32 PM | Updated on Sep 12 2017 2:04 AM
కామారెడ్డి: గణనాధుడి శోభాయాత్ర సందర్భంగా పోలీసుల తీరుకు నిరసనగా అఖిలపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా బంద్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా పట్టణంలోని సుభాష్రోడ్లో గత ప్రధాన రహదారిపై వంటా-వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వేలాది మందితో భారీర్యాలీ చేపట్టారు. కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ శ్వేతలను సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Advertisement
Advertisement