చావుడప్పు కొడుతూ పరలోకాలకు.. | Autopsy dappu with person Heart attack | Sakshi
Sakshi News home page

చావుడప్పు కొడుతూ పరలోకాలకు..

Mar 5 2016 1:25 AM | Updated on Mar 28 2018 11:26 AM

శవయాత్రలో డప్పు కొడుతూ గుండెపోటుకు గురై ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.

మంచాల: శవయాత్రలో డప్పు కొడు తూ గుండెపోటుకు గురై ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రానికి చెందిన గ్యార రమేష్ (36) వృత్తిరీత్యా పెయింటర్. గ్రామంలో కాల్యా లచ్చయ్య అనే వృద్ధుడు చనిపోవడంతో డప్పు వాయించడానికి కూలీకి వెళ్లాడు. శవయాత్రలో డప్పు వాయించిన రమేష్ ఆకస్మికంగా ఛాతీలో నొప్పి వచ్చిందంటూ సమీపంలోని వికలాంగుల భవనానికి వచ్చాడు. అక్కడే మంచి నీళ్లు తాగి ప్రాణాలు వదిలాడు. దీంతో కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement