చంద్రబాబుకు నోటీసులు జారీ చేసే అవకాశం! | acb ready to issue the notice | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు నోటీసులు జారీ చేసే అవకాశం!

Jun 16 2015 1:32 PM | Updated on Aug 17 2018 12:56 PM

చంద్రబాబుకు నోటీసులు జారీ చేసే అవకాశం! - Sakshi

చంద్రబాబుకు నోటీసులు జారీ చేసే అవకాశం!

ఓటుకు కోట్లు వ్యవహారంపై తెలంగాణ ఏసీబీ తన దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో చంద్రబాబు నాయుడుకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ : ఓటుకు కోట్లు వ్యవహారంపై తెలంగాణ ఏసీబీ తన దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో చంద్రబాబు నాయుడుకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని గంటల్లో ఆయనకు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి  ఉన్నత స్థాయి నుంచి అనుమతి లభించినట్లు తెలుస్తోంది. చట్టప్రకారం అన్ని చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ, సీపీ మహేందర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం గవర్నర్ తో సమావేశం అయ్యారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement