చంద్రబాబుకు నోటీసులు జారీ చేసే అవకాశం! | acb ready to issue the notice | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు నోటీసులు జారీ చేసే అవకాశం!

Jun 16 2015 1:32 PM | Updated on Aug 17 2018 12:56 PM

చంద్రబాబుకు నోటీసులు జారీ చేసే అవకాశం! - Sakshi

చంద్రబాబుకు నోటీసులు జారీ చేసే అవకాశం!

ఓటుకు కోట్లు వ్యవహారంపై తెలంగాణ ఏసీబీ తన దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో చంద్రబాబు నాయుడుకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ : ఓటుకు కోట్లు వ్యవహారంపై తెలంగాణ ఏసీబీ తన దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో చంద్రబాబు నాయుడుకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని గంటల్లో ఆయనకు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి  ఉన్నత స్థాయి నుంచి అనుమతి లభించినట్లు తెలుస్తోంది. చట్టప్రకారం అన్ని చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ, సీపీ మహేందర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం గవర్నర్ తో సమావేశం అయ్యారు.

 

Advertisement
 
Advertisement
Advertisement