బొమ్మన్‌పాడ్‌లో 950 నాటుకోళ్ల మృత్యువాత | 950 deaths of Chickens | Sakshi
Sakshi News home page

బొమ్మన్‌పాడ్‌లో 950 నాటుకోళ్ల మృత్యువాత

Apr 5 2018 2:30 PM | Updated on Oct 8 2018 4:59 PM

950 deaths of Chickens - Sakshi

ఫారంలో మృతిచెందిన కోళ్లు

దామరగిద్ద (నారాయణపేట): వడగడ్ల వర్షానికి నాటుకోళ్ల ఫారంలో 950 కోళ్లు మృతిచెందాయి. ఈ సంఘటన మండలంలోని బొమ్మన్‌పాడులో ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు బడేసాబ్‌ గత రెండు నెలల కిత్రం రూ.లక్ష వెచ్చించి సుమారు 1,500 నాటుకోళ్లను పెంచాడు.

కాగా ఇటీవల కురిసిన వడగళ్ల వానకు కోళ్ల ఆరోగ్యం దెబ్బతిని బుధవారం వరకు సుమారు 950 కోళ్లు మృతిచెందాయి. ఉపాధి కోసం పెంచిన కోళ్లు మృతిచెందడంతో ఆర్థికంగా నష్టపోయాడు. బడేసాబ్‌కు ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని సర్పంచ్‌ సాయమ్మ, ఎంపీటీసీ అనంతమ్మ, నాయకులు భగవంతు, శేఖర్‌ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement