మహబూబ్నగర్ జిల్లా మానవపాడు మండలం ఇటిక్యాల స్టేజి వద్ద శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తూ కారు బోల్తా కొట్టింది.
మహబూబ్నగర్ (మానవపాడు): మహబూబ్నగర్ జిల్లా మానవపాడు మండలం ఇటిక్యాల స్టేజి వద్ద శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తూ కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్తో పాటు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా క్షతగాత్రుల వివరాలు ఇంకా తెలియరాలేదు.