కారులో తరలిస్తున్న 5.30 కేజీల బంగారం పట్టివేత | 5.30 kg gold seized in nalgonda district | Sakshi
Sakshi News home page

కారులో తరలిస్తున్న 5.30 కేజీల బంగారం పట్టివేత

Apr 24 2015 11:54 PM | Updated on Sep 3 2017 12:49 AM

కారులో అక్రమంగా తరలిస్తున్న 5.30 కేజీల బంగారాన్ని పోలీసులు గుర్తించారు.

మిర్యాలగూడ : కారులో అక్రమంగా తరలిస్తున్న 5.30 కేజీల బంగారాన్ని పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... పోలీసులు పట్టణంలోని వన్ టౌన్ పరిధిలో శుక్రవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న కారును ఆపి తనిఖీ చేయగా అక్రమంగా(బిల్లులు లేకుండా) తరలిస్తున్న 5.30 కేజీల బంగారాన్ని పోలీసులు గుర్తించారు.

కారులోని వ్యక్తిని అదుపులోకి తీసుకొని, కారు, బంగారాన్ని స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. కాగా, నిందితుడు విజయవాడకు చెందిన బంగారం హోల్‌సేల్ వ్యాపారి సూరిబాబుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement