దోపిడీ దొంగల బీభత్సం:20 ఇళ్లల్లో చోరీ | 20 houses robbed in warangal | Sakshi
Sakshi News home page

దోపిడీ దొంగల బీభత్సం:20 ఇళ్లల్లో చోరీ

Nov 21 2014 11:06 AM | Updated on Aug 30 2018 5:27 PM

వరంగల్ జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు.

వరంగల్:జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. శుక్రవారం ఉదయం 20 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డ దొంగలు భారీ ఎత్తున బంగారాన్ని, నగదును దోచుకెళ్లారు. ములుగు శివారు ప్రాంతంతో పాటు, ప్రేమ్ నగర్, జాకారంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో 20 తులాల బంగారాన్ని, రూ. లక్ష నగదును అపహరించారు.

 

దొంగలను అడ్డుకున్నఒక జంటపై ఇనుప రాడ్లతో దాడి దిగారు. దీంతో వారికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఉదంతంతో ఉలిక్కిపడిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గత నెలలో జిల్లాలో ఇదే క్రమంలో దోపిడి జరగడంతో దానిపై పోలీసులు దృష్టి సారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement