రెండు బైకులు ఢీ : ఇద్దరి మృతి | 2 died in road accident at khammam distirict | Sakshi
Sakshi News home page

రెండు బైకులు ఢీ : ఇద్దరి మృతి

Mar 21 2015 11:02 AM | Updated on Sep 2 2017 11:11 PM

ఖమ్మం జిల్లా పినపాక మండలంలో రెండు బైకులు ఢీకొన్నాయి.

ఖమ్మం: ఖమ్మం జిల్లా పినపాక మండలంలో రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో కరకగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతే పద్మాపురం గ్రామ సమీపంలో జరిగింది. పద్మాపురం సమీపంలోని  ఓ మూల మలుపు వద్ద రెండు బైకులు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని భద్రాచలం ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
(పినపాక)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement