విష పురుగుల దాడి: 14 మందికి గాయాలు | 14 students injured due to Insect Attack | Sakshi
Sakshi News home page

విష పురుగుల దాడి: 14 మందికి గాయాలు

Nov 17 2017 12:59 PM | Updated on Nov 9 2018 4:44 PM

నిజామాబాద్ మండలం మోపాల్ మైనారిటీ గురుకుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులు విష పురుగుల కాటుకు గురయ్యారు.

సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ మండలం మోపాల్ మైనారిటీ గురుకుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులు విష పురుగుల కాటుకు గురయ్యారు. విషపురుగులు కుట్టడం వల్ల 14 మందికి ముఖాలు ఉబ్బి(వాపు)పోయాయి.

ఆశ్రమ పాఠశాల పక్కనే పొలాలు ఉన్నందున పంటపై పురుగుల మందు కొట్టడంతో ఈ విష కీటకాలు ఎగిరి రాత్రి  సమయంలో ఆశ్రమ పాఠశాల వైపు వచ్చాయని బాధితులు తెలుపుతున్నారు. హాస్టల్‌ గదుల్లోకి పురుగులు రావడంతో వారు ఆందోళన చెందుతున్నారు. వీరందరినీ వైద్యం కోసం పీహెచ్‌సీకి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement