విష పురుగుల దాడి: 14 మందికి గాయాలు

సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ మండలం మోపాల్ మైనారిటీ గురుకుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులు విష పురుగుల కాటుకు గురయ్యారు. విషపురుగులు కుట్టడం వల్ల 14 మందికి ముఖాలు ఉబ్బి(వాపు)పోయాయి.

ఆశ్రమ పాఠశాల పక్కనే పొలాలు ఉన్నందున పంటపై పురుగుల మందు కొట్టడంతో ఈ విష కీటకాలు ఎగిరి రాత్రి  సమయంలో ఆశ్రమ పాఠశాల వైపు వచ్చాయని బాధితులు తెలుపుతున్నారు. హాస్టల్‌ గదుల్లోకి పురుగులు రావడంతో వారు ఆందోళన చెందుతున్నారు. వీరందరినీ వైద్యం కోసం పీహెచ్‌సీకి తరలించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top