కలుషితాహారం తిని 10 మందికి అస్వస్థత | 10 people hospitalized for food poisoning | Sakshi
Sakshi News home page

కలుషితాహారం తిని 10 మందికి అస్వస్థత

Oct 21 2015 4:06 PM | Updated on Oct 5 2018 6:48 PM

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో కలుషితాహారం తిని 10 మంది అస్వస్థతకు గురయ్యారు.

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో కలుషితాహారం తిని 10 మంది అస్వస్థతకు గురయ్యారు. విజయదశమి సందర్భంగా  గౌరారం పంచాయితిలోని గుట్టకింది తండాలో మంగళవారం రాత్రి తండావాసులు విందు ఏర్పాటుచేసుకున్నారు. విందులో మాంసాహారాన్ని కూడా తీసుకున్నారు.

ఆ తర్వాత నుంచి10 మందికి తీవ్రంగా వాంతులు, విరోచనాలు కావడంతో నీరసించిపోయారు. దీంతో వారిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆహారం కలుషితం కావడం వల్లే అస్వస్థతకు గురైనట్లు వైద్యులు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement