తమిళసినిమా: గతంలో కథానాయకుడిగా పలు చిత్రాలు చేసిన నటుడు ప్రభుకు అభిమానులు ఎక్కువేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నిర్మాతగానూ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై చంద్రముఖి లాంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.ప్రస్తుతం కథల్లో ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటిస్తున్న ప్రభు బహుభాషా నటుడిగా రాణిస్తున్నారు. తాజాగా తమిళంలో ఈయన ప్రధాన పాత్రలో మీన్ కుళంబుమ్ మణ్ పానైయుమ్ అనే చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని శివాజీగణేశన్ వారసుడు రామ్కుమార్ కొడుకు దుశ్యంత్ ఈశన్ ప్రొడక్షన్స్ అనే నూతన నిర్మాణ సంస్థలో రూపొందిస్తుండడం విశేషం.
దీనికి అముదేశ్వర్ దర్శకత్వం వహించనున్నారు. ప్రభుతో పాటు కాళిదాస్, జయరామ్, ఆష్నాజవేరి, ఎంఎస్.భాస్కర్ ముఖ్య పాత్రలు పోషించనున్న ఈ చిత్రానికి డీ.ఇమాన్ సంగీత బాణీలు అందించనున్నారు. చిత్ర షూటింగ్ అధిక భాగం మలేషియాలో జరపనుండటంతో చిత్ర దర్శక నిర్మాతలు ఇటీవల లోకేషన్స్ ఎంపిక చేయడానికి మలేషియా వెళ్లారు. అక్కడ కబాలీ చిత్ర షూటింగ్లో ఉన్న సూపర్స్టార్ రజనీకాంత్ను మర్యాదపూర్వకంగా కలిసి మీన్ కుళంబుమ్ మణ్ పానైయుమ్ చిత్ర వివరాలను ఆయనకు చెప్పారు.
అప్పుడు రజనీకాంత్ పలు కళా ఖండాలను నిర్మించిన శివాజీ ప్రొడక్షన్స్ మాదిరిగానే ఈ ఈశన్ ప్రొడక్షన్స్ సంస్థ ఎదగాలని ఆకాంక్షించారు. చిత్రం టైటిల్ బాగుందని మీన్ కుళంబుమ్ మణ్ పానైయుమ్ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశీర్వదించినట్లు నిర్మాత దుశ్యంత్ వెల్లడించారు. ప్రతిభావంతులైన కొత్త నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని ప్రోత్సహించాలన్న ఆశయంతోనే ఈశన్ ప్రొడక్షన్ప్ సంస్థను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ను 20వ తేదీ నుంచి చెన్నైలో నిర్వహించనున్నట్లు, రెండో షెడ్యూల్ను జనవరి రెండో తేదీ నుంచి మలేషియాలో జరపనున్నట్లు దుశ్యంత్ వెల్లడించారు.
ప్రభు చిత్రానికి రజనీకాంత్ ఆశీస్సులు
Published Fri, Nov 20 2015 2:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
ఎట్టకేలకు పెట్టుబడి సాయం
సత్వరన్యాయం అందించడమే లక్ష్యం
సమయం లేదు మిత్రమా..
ముగ్గురిపై హత్యాయత్నం కేసు కొట్టివేత
కొబ్బరిచెట్టుపై పడిన పిడుగు
బీజేపీ అభ్యర్థికే మా మద్దతు
మోదీ గెలిస్తే రిజర్వేషన్లు మాయం
హామీలను విస్మరించిన కాంగ్రెస్
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement