ఏడేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం | Seven-Year-Old Girl Gang Raped by 3 Minors | Sakshi
Sakshi News home page

ఏడేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

Jul 7 2014 10:15 PM | Updated on Sep 2 2017 9:57 AM

ఏడేళ్ల బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటన పశ్చిమ ఢిల్లీలోని పశ్చిమ్‌విహార్ ప్రాంతంలో ఈ నెల మూడో తేదీన చోటుచేసుకుంది. ఈ విషయం ఆదివారం

న్యూఢిల్లీ: ఏడేళ్ల బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటన పశ్చిమ ఢిల్లీలోని పశ్చిమ్‌విహార్ ప్రాంతంలో ఈ నెల మూడో తేదీన చోటుచేసుకుంది. ఈ విషయం ఆదివారం వెలుగులోకొచ్చింది. వివరాలిలా ఉన్నాయి. మామిడిపండు ఇస్తామంటూ ముగ్గురు నిందితులు బాధితురాలిని సమీపంలోని ఉద్యానవనానికి తీసుకుపోయి అక్కడ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులంతా పది నుంచి 15 ఏళ్ల వయసువారేనని పోలీసులు తెలిపారు. వీరిని జువెనైల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచిన అనంతరం కస్టడీకి తరలించామన్నారు. ఆదివారం ఉదయం బాధితురాలి మర్మాంగంలో సమస్యలు తలెత్తడంతో జరిగిన సంఘటనను తల్లికి వివరించింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుమేరకు  పశ్చిమ్‌విహార్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement