సెయిలింగ్ రెగెట్టా | sailing regatta Boats Rally in Korukkupeta | Sakshi
Sakshi News home page

సెయిలింగ్ రెగెట్టా

Jan 23 2015 3:47 AM | Updated on Sep 2 2017 8:05 PM

సెయిలింగ్ రెగెట్టా

సెయిలింగ్ రెగెట్టా

సముద్రజలాలు, తీరప్రాంతాలు కాలుష్యానికి గురి కాకుండా ఉంచుకునేలా అవగాహన కల్పించేందు కు గురువారం సెయిలింగ్‌రెగెట్టా

కొరుక్కుపేట:సముద్రజలాలు, తీరప్రాంతాలు కాలుష్యానికి గురి కాకుండా ఉంచుకునేలా అవగాహన కల్పించేందు కు గురువారం సెయిలింగ్‌రెగెట్టా (పడవల ర్యాలీ)ని ప్రారంభించారు. దీన్ని కోస్టుగార్డు రీజన్ (ఈస్ట్) కమాం డర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎస్పీ శర్మ, రాష్ట్ర ప్రభుత్వ టూరిజం ప్రిన్సిపాల్ సెక్రటరీ హర్ సహాయ్ మీనా జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో ది ఆర్మ్‌డ్ ఫోర్సెస్, కార్పొరేట్స్, సైలింగ్ క్లబ్స్ నుంచి 100 మంది సైలర్లు రెగెట్టాలో పాల్గొన్నారు. మూడు రోజులు పాటు నిర్వహించే ఈవెంట్ ఈ నెల 24వ తేదీతో ముగియనుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌పి శర్మ మాట్లాడుతూ ఇండియన్ కోస్టుగార్డు ఫిబ్రవరి 1-2015 నాటికి జాతీయ సేవలో 38 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందన్నారు. సముద్రంలో కాలుష్య నివారణకు, సముద్రతీర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణకు తీర్చిదిద్దడంలో కోస్టుగార్డు కృషి చేసిందని గుర్తు చేశారు. ప్రజల్లోనూ ప్రత్యేక అవగాహన తెచ్చినట్లు వివరించారు. సైలింగ్ రెగెట్టా ఈవెంట్‌లో 100 మంది పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement