తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Published Thu, Sep 29 2016 9:08 AM

rush of devotees increased in Tirumala

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్ల నిండా భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. నిన్న(బుధవారం) స్వామివారిని 77,369 మంది భక్తులు దర్శించుకోగా.. హుండీ ద్వారా శ్రీవారికి రూ. 2.64 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

 

Advertisement
Advertisement