నగరంలో నిలిచిపోయిన బస్సులు | rtc buses go off rods over TMU bandh | Sakshi
Sakshi News home page

నగరంలో నిలిచిపోయిన బస్సులు

Sep 12 2016 10:50 AM | Updated on Sep 4 2017 1:13 PM

అక్రమ బదిలీలకు నిరసనగా.. ఆర్టీసీ కార్మికులు సోమవారం విధులు బహిష్కరించారు.

హైదరాబాద్: అక్రమ బదిలీలకు నిరసనగా.. ఆర్టీసీ కార్మికులు సోమవారం విధులు బహిష్కరించారు. దీంతో నగరంలోని 8 డిపోల పరిధిలో వందల బస్సులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకారణంగా బదిలీలు చేపట్టడానికి నిరసిస్తూ సోమవారం టీఎంయూ ఆధ్వర్యంలో ఉద్యోగులు బంద్ పాటిస్తున్నారు. ఉప్పల్ డిపో పరిధిలో కండక్టర్‌గా పని చేస్తున్న రత్నకుమారిని అకారణంగా బదిలీ చేశారని ఆగ్రహించిన తోటి ఉద్యోగులు ఈ రోజు బదిలీకి నిరసనగా బంద్‌లో పాల్గొంటున్నారు. ఈ విషయం పై ఉన్నతాధికారులను సంప్రదించారు. అయితే ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందడంతోనే బదిలీ చేశామని అధికారులు చెప్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement