కదిలించిన ‘సాక్షి’ కథనం | rs. 40 thousands financial help | Sakshi
Sakshi News home page

కదిలించిన ‘సాక్షి’ కథనం

Sep 22 2016 12:04 PM | Updated on Oct 2 2018 5:51 PM

కదిలించిన ‘సాక్షి’ కథనం - Sakshi

కదిలించిన ‘సాక్షి’ కథనం

సాక్షిలో ప్రచురితమైన మానవీయ కథనం సహృదయులను కదిలించింది.

బాధితులకు రూ.40 వేల ఆర్థికసాయం చేసిన ఎన్‌ఆర్‌ఐ కుటుంబం 
 
చెన్నూర్ : ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు పట్టణానికి చెందిన గడ్డం శంకర్-మాంతులు అనారోగ్యంతో మృతి చెందగా వారి పిల్లలు దీప, పూజల ధీనగాథపై ‘కన్నవారు దూరమై..బతుకు భారమై’ శీర్షికన ఈ నెల 18న సాక్షిలో ప్రచురితమైన మానవీయ కథనం సహృదయులను కదిలించింది. ఇప్పటికే జెడ్పీ వైస్‌చైర్మన్ మూల రాజిరెడ్డితోపాటు పలువురు 30 వేలకు పైగా ఆర్థికం సాయం అందించగా..తాజాగా అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న మంచాల సంతోశ్ తన మిత్రుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకొని చలించిపోయూరు.
 
తన వంతు సహాయం చేసేందుకు ముందుకువచ్చారు. తల్లిదండ్రులు మృతి చెంది అనాథలుగా మారిన బాలికలు దీప, పూజకు రూ.40 వేల ఆర్థిక సహాయాన్ని తన తల్లిదండ్రులు మంచాల సత్యనారాయణ, సావిత్రితో ఇప్పించారు. ఈ సందర్భంగా సంతోశ్ అమెరికా నుంచి సాక్షితో మాట్లాడారు. ‘నిరుపేద బాలికలు దీప, పూజలు ధీనగాథ నన్ను కదిలించింది. అమ్మాయిలిద్దరూ ఉన్నత చదువులు చదివి గొప్ప స్థాయికి ఎదగాలి. అప్పుడే వారి తల్లిదండ్రుల ఆత్మలు శాంతిస్తారు’  అని అన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement