టీడీపీ ఎమ్మెల్యేకు చెందిన రూ.300 కోట్ల ఆస్తుల స్వాధీనం? | Rs 300 crore seized from TDP MLA | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యేకు చెందిన రూ.300 కోట్ల ఆస్తుల స్వాధీనం?

Sep 29 2016 10:14 AM | Updated on Sep 27 2018 4:47 PM

చిత్తూరు ఎమ్మెల్యే డీకే సత్యప్రభకు చెందిన కంపెనీలపై ఆదాయపు పన్ను అధికారులు దాడి చేసి దాదాపు రూ.300 కోట్ల ఆస్తులను గుర్తించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.

చిత్తూరు: చిత్తూరు ఎమ్మెల్యే డీకే సత్యప్రభకు చెందిన కంపెనీలపై ఆదాయపు పన్ను అధికారులు దాడి చేసి దాదాపు రూ.300 కోట్ల ఆస్తులను గుర్తించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇది జిల్లావ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. బుధవారం బెంగళూరులో ఐటీ అధికారులు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ఇందులో బెంగళూరులోని వైదేహీ, మాల్యా ఆసుపత్రుల్లో దాడులు చేయగా దాదాపు రూ.265 కోట్ల ఆస్తులకు సరైన ఆధారాలు చూపకపోవడంతో వాటిని సీజ్ చేసినట్లు వారు తెలిపారు. సెప్టెంబర్ 23 నుంచి మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆమె కంపెనీలు, ఇళ్లలో  జరిగిన సోదాల్లో ఎమ్మేల్యేకు సంబంధించిన విద్యా సంస్థల నుంచి దాదాపు రూ.43 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నామని ఐటీ అధికారులు పేర్కొన్నారు. 13 సంవత్సరాల ఆదాయ ఖర్చుల వివరాలు తెలపాల్సిందిగా అధికారులు ఆమెను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement