హోలీ సందర్భంగా పటిష్ట భద్రత
కూడళ్లలో ప్రత్యేక తనిఖీలు
వీడియో కెమెరాలతో పర్యవేక్షణ
ట్రాఫిక్ నిబంధన పాటించని వారిపై కఠిన చర్యలు
కమిషనర్ ముక్తేశ్ చంద ర్ వెల్లడి
న్యూఢిల్లీ: హోలీ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన కూడళ్లలో ప్రత్యేక తనిఖీల కోసం 200 బృందాలను సిద్ధం చేశారు. 20 ఇంటర్స్పెక్టర్ వాహనాలతో గస్తీ ముమ్మరం చేయనున్నారు. మద్యం తాగి వాహనం నడపడం, బైక్ విన్యాసాలు, విచక్ష ణా రహితంగా వాహనాలు నడపడంతోపాటు ఇతర ట్రాఫిక్ నియమాలు పాటించని వారిని గుర్తించేందుకు వీడియో కెమేరాలు ఉపయోగిస్తున్నారు. రద్దీ కారణంగా నిందుతులను అప్పటికప్పుడే విచారిచడం లేదు. చలానాలను వారి ఇంటికి పంపిస్తారు. గత సంవత్సరం ఇదే తరహాలో 4000 మంది నిందుతులకు చలానాలు వారి ఇంటికే పంపిచారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే కేవలం జరిమానాతో సరిపెట్టడం లేదు, వారి వాహనం స్వాధీనం చేసుకోవడంతోపాటు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడితే డ్రైవర్ను అరెస్ట్ చేయడంతోపాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుంటామని ట్రాఫిక్ కమిషనర్ ముక్తేశ్ చందర్ చెప్పారు. జరిమానా విధించడం మాత్రమే కాక జైలు శిక్షతోపాటు వారి డ్రైవింగ్ లెసైన్స్ రద్దు చేస్తామని తెలిపారు. పండుగ సందర్భాల్లో హెల్మెట్ ధరించకుండా వాహనం నడపడం, బైక్తో వివిధ విన్యాసాలు చేయడం సర్వసాధారణం. అయితే ఏలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
వాహన యజమాని కాకుండా ఇతరులు, మైనర్లు వాహనం నడిపితే యజమానిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. లై సెన్స్ కాలం పూర్తయి ఉన్నా, విచక్షణా రహితంగా వాహనం నడిపినా, హెల్మెట్ వాడకపోయినా నిబంధనల మేరకు చ ర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పోలీసుల లెక్కల ప్రకారం గత సంవత్సరం చట్టరీత్యా 13,015 మందిపై వివిధ నేరాల కింద చర్యలు తీసుకున్నారు. వీరిలో హెల్మెట్ వాడని కారణంగా 5,633 మందిపై, సిగ్నల్ జంప్ చేసిన నేరంపై 1,544 మందిపై చర్యలు తీసుకున్నారు.
అదే విధంగా ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న 1,464కి, ప్రమాదకరంగా వాహనం నడిపిన 139 మందికి జరిమానాలు విధించారు. మద్యం తాగి వాహనం నడిపిన 2,090 మందికి చట్టరీత్యా శిక్ష విధించారు. అంతేకాక 881 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల నేత్రాల్లో ఢిల్లీ ర హదారులు
Published Fri, Mar 6 2015 12:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement