breaking news
Special audits
-
పోలీసుల నేత్రాల్లో ఢిల్లీ ర హదారులు
హోలీ సందర్భంగా పటిష్ట భద్రత కూడళ్లలో ప్రత్యేక తనిఖీలు వీడియో కెమెరాలతో పర్యవేక్షణ ట్రాఫిక్ నిబంధన పాటించని వారిపై కఠిన చర్యలు కమిషనర్ ముక్తేశ్ చంద ర్ వెల్లడి న్యూఢిల్లీ: హోలీ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన కూడళ్లలో ప్రత్యేక తనిఖీల కోసం 200 బృందాలను సిద్ధం చేశారు. 20 ఇంటర్స్పెక్టర్ వాహనాలతో గస్తీ ముమ్మరం చేయనున్నారు. మద్యం తాగి వాహనం నడపడం, బైక్ విన్యాసాలు, విచక్ష ణా రహితంగా వాహనాలు నడపడంతోపాటు ఇతర ట్రాఫిక్ నియమాలు పాటించని వారిని గుర్తించేందుకు వీడియో కెమేరాలు ఉపయోగిస్తున్నారు. రద్దీ కారణంగా నిందుతులను అప్పటికప్పుడే విచారిచడం లేదు. చలానాలను వారి ఇంటికి పంపిస్తారు. గత సంవత్సరం ఇదే తరహాలో 4000 మంది నిందుతులకు చలానాలు వారి ఇంటికే పంపిచారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే కేవలం జరిమానాతో సరిపెట్టడం లేదు, వారి వాహనం స్వాధీనం చేసుకోవడంతోపాటు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడితే డ్రైవర్ను అరెస్ట్ చేయడంతోపాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుంటామని ట్రాఫిక్ కమిషనర్ ముక్తేశ్ చందర్ చెప్పారు. జరిమానా విధించడం మాత్రమే కాక జైలు శిక్షతోపాటు వారి డ్రైవింగ్ లెసైన్స్ రద్దు చేస్తామని తెలిపారు. పండుగ సందర్భాల్లో హెల్మెట్ ధరించకుండా వాహనం నడపడం, బైక్తో వివిధ విన్యాసాలు చేయడం సర్వసాధారణం. అయితే ఏలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. వాహన యజమాని కాకుండా ఇతరులు, మైనర్లు వాహనం నడిపితే యజమానిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. లై సెన్స్ కాలం పూర్తయి ఉన్నా, విచక్షణా రహితంగా వాహనం నడిపినా, హెల్మెట్ వాడకపోయినా నిబంధనల మేరకు చ ర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పోలీసుల లెక్కల ప్రకారం గత సంవత్సరం చట్టరీత్యా 13,015 మందిపై వివిధ నేరాల కింద చర్యలు తీసుకున్నారు. వీరిలో హెల్మెట్ వాడని కారణంగా 5,633 మందిపై, సిగ్నల్ జంప్ చేసిన నేరంపై 1,544 మందిపై చర్యలు తీసుకున్నారు. అదే విధంగా ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న 1,464కి, ప్రమాదకరంగా వాహనం నడిపిన 139 మందికి జరిమానాలు విధించారు. మద్యం తాగి వాహనం నడిపిన 2,090 మందికి చట్టరీత్యా శిక్ష విధించారు. అంతేకాక 881 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. -
టార్గెట్ భారీ.. తనిఖీలకు రెడీ
వార్షిక లక్ష్యం రూ.341 కోట్లు ఇప్పటికి రూ.167 కోట్ల ఆదాయం ప్రత్యేక డ్రైవ్లకు రవాణా శాఖ సిద్ధం గ్రామీణ ప్రాంతాల్లో వరుస తనిఖీలకు నిర్ణయం భారీగా విధించిన టార్గెట్లను చేరుకోవడానికి రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలకు సిద్ధమవుతోంది. ఇందుకు గ్రామీణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటోంది. వచ్చే వారం నుంచి అమలులోకి తీసుకురానుంది. విజయవాడ : జిల్లా రవాణా శాఖ అధికారులు భారీ ఆదాయం రాబట్టుకునేందుకు కసరత్తు మొదలుపెట్టారు. రాష్ట్ర రవాణా శాఖ జిల్లాకు భారీ టార్గెట్ను నిర్దేశించిన నేపథ్యంలో దానిని చేరుకునే దిశగా ప్రత్యేక డ్రైవ్లు, వరుస తనిఖీలు, కేసుల నమోదు కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించారు. తద్వారా నిర్దేశిత లక్ష్యాన్ని కొంతమేరకైనా చేరుకోవటంతో పాటు రవాణా భద్రతను మరింత పటిష్టపరచటమే లక్ష్యంగా ముందుకు సాగనున్నారు. ప్రధానంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వాహన తనిఖీలు, కేసుల నమోదు కార్యక్రమం జరగడం లేదు. కేవలం విజయవాడ నగర పరిసర ప్రాంతాలు, మునిసిపాలిటీల సమీపంలోనే రవాణ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పుడు దీనిని జిల్లాలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగించాలని నిర్ణయించారు. వచ్చే వారం నుంచి దీనిని అమలులోకి తీసుకురానున్నారు. జిల్లా రవాణ శాఖకు ఆశాఖ కమిషనర్ ఈఏడాది రూ. 341 కోట్ల వార్షిక లక్ష్యాన్ని నిర్దేశించారు. జిల్లాలో అన్ని కమర్షియల్ వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు, మూడు నెలలకు ఒకసారి చెల్లించే త్రైమాసిక టాక్స్లు పూర్తి స్థాయిలో వసూలు చేయగలిగితే లక్ష్యాన్ని 90 శాతం వరకు చేరుకునే అవకాశం ఉంది. ఈఏడాది ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది మార్చి 31 లోగా వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంది. అయితే గడిచిన ఎనిమిది నెలల కాలంలో రూ.167 కోట్లు ఆదాయం లభించింది. గత ఏడాది రూ.304 కోట్లు వార్షిక లక్ష్యం విధించగా, రూ.223 కోట్లు వసూలు చేసి లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. గత ఏడాది రెండు నెలల పాటు సమైక్యాంధ్ర ఉద్యమం ఉధ్రుతంగా సాగిన విషయం తెలిసిందే. రవాణాశాఖ ఉద్యోగులు కూడా విధులు బహిష్కరించి ఉద్యమంలో పాల్గొన్నారు. దీంతో ఆదాయం భారీగా పడిపోయింది. ఈక్రమంలో కనీసం ఈఏడాది అయినా లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఎనిమిది నెలల కాలానికి కనీసం 70 శాతం లక్ష్యం పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం 50 శాతం మాత్రమే పూర్తి చేశారు. ఈక్రమంలో నూతనంగా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్గా ఎస్.వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. ఆదాయం పెంపుదలే ప్రస్తుత ప్రధాన ఎజెండాగా తీసుకొని ఆయన కసరత్తు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలే లక్ష్యం జిల్లాలో మొత్తం 1,44,341 వాహనాలు ఉన్నాయి. వీటిలో 46 వేలు గూడ్స్ వెహికల్స్ కాగా, 12,987 ట్రాక్టర్లు, 13,880 ట్రాలీలు, 24,811 ద్విచక్ర వాహనాలు, 332 అంబులెన్స్లు, 40 వేల ఆటోలు, 550 బస్సులు, 2400 స్కూల్ బస్సులు, 8,882 లారీలతో పాటు ఇతర వాహనాలు ఉన్నాయి. అయితే ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ట్రాక్టర్ యజమానులు అనేకమంది త్రైమాసిక పన్ను సక్రమంగా చెల్లించటం లేదని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ క్రమంలో ముందుగా ట్రాక్టర్ యజమానులకు అవగాహన నిర్వహించి అందరూ తప్పనిసరిగా పన్ను చెల్లించేలా చేయటానికి కసరత్తు ప్రారంభించారు. పొలం పనుల సీజన్లో మినహా అనేకమంది ట్రాక్టర్లు వినియోగించడంలేదు. ఈక్రమంలో అలాంటి యజమానులు అందరూ రవాణాశాఖ అధికారులకు దానికి సంబంధించి దరఖాస్తు ఇస్తే అలాంటి వారికి టాక్స్ పడదు. ప్రస్తుతం రెండో త్రైమాసిక పన్నులు నూరు శాతం వసూలు చేయాలని నిర్ణయించారు. అలాగే జిల్లాలో రవాణ శాఖకు సంబంధించి గరికపాడు, తిరువూరు ప్రాంతాల్లో రెండు చెక్పోస్ట్లు ఉన్నాయి. ఇవికాకుండా జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేసి రవాణ భద్రత పెంచటంతో పాటు ఆదాయం కూడా పెంచుకోవాలని నిర్ణయించారు. ముఖ్యంగా ట్రాక్టర్లు, లైట్ గూడ్స్ వాహనాల యజమానులు సక్రమంగా త్రైమాసిక పన్నును చెల్లించడంలేదని అధికారులు నిర్ధారించుకున్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఆటోలు, ప్రెవేట్ బస్సుల్లో ఓవర్లోడింగ్ ఎక్కువగా ఉంది. దీనిపై కూడా దృష్టి సారించి డ్రైవ్ నిర్వహించటం ద్వారా ప్రమాదాలను నివారించటంతోపాటు కేసుల నమోదు ద్వారా ఆదాయం పెంచుకోవాలని నిర్ణయించారు. మరోవైపు ఒక్కొక్క చోట కాకుండా ఒకేరోజు ఎక్కువ ప్రాంతాల్లో డ్రైవ్ కొనసాగించాలని నిర్ణయించారు. విజయవాడ రాజధాని అయిన నేపథ్యంలో గతంతో పోలిస్తే ఐదు శాతం వాహనాల సంఖ్య అధికంగా పెరిగింది. ఈక్రమంలో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవటానికి డ్రైవ్లు ఉపయోగపడతాయని భావిస్తున్నారు.