బాన్సువాడ- బీర్కూరు మధ్య నూతన మినీ పల్లె వెలుగు బస్సును స్వయంగా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నడిపి ప్రారంభించారు.
పల్లె వెలుగు బస్సును నడిపిన మంత్రి
May 10 2017 3:53 PM | Updated on Sep 5 2017 10:51 AM
బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ- బీర్కూరు మధ్య నూతన మినీ పల్లె వెలుగు బస్సును స్వయంగా రాష్ట్ర మంత్రి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి నడిపి ప్రారంభించారు. అనంతరం బాన్సువాడ బస్టాండులో రూ. 10 లక్షలతో నిర్మించే అదనపు ఫ్లాట్ ఫాంలకు శంఖుస్థాపన చేశారు. అలాగే, మిషన్ కాకతీయ -3లో భాగంగా రూ.86.95 లక్షలతో బాన్సువాడ మండలం రాంపూర్ చెరువు పునరుద్దరణ పనులను ప్రారంభించారు.
Advertisement
Advertisement