breaking news
palle velugu
-
Photo Feature: సరికొత్త ప్రయోగం.. పచ్చ తివాచీ
రుతుపవనాల రాకతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు దేశ వాణిజ్య రాజధాని ముంబై అతలాకుతలమైంది. తొలకరి వర్షానికే వరంగల్ మహా నగరం వణికిపోయింది. నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అత్యధిక కిలోమీటర్లు తిరిగిన పల్లెవెలుగు బస్సులను లాజిస్టిక్ వ్యాన్లుగా మార్చుతోంది. ఏటా లక్షల టన్నుల బొగ్గును వెలికితీస్తున్న సింగరేణి సంస్థ పర్యావరణాన్ని సమతూకం చేసేందుకు దీక్షతో మొక్కల పెంపకాన్ని ఉద్యమంగా సాగిస్తోంది. -
మనసా వాచా కర్మణా ‘స్వచ్ఛ సంకల్పం’ చేయాలి: సీఎం జగన్
అమరావతి: ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై కార్యాచరణ (జగనన్న స్వచ్ఛ సంకల్పం)తో పాటు, వైఎస్సార్ జలకళ, గ్రామీణ తాగునీటి సరఫరా (జల్జీవన్ మిషన్-జేజేఎం), వీధుల్లో ఎల్ఈడీ లైటింగ్ (జగనన్న పల్లె వెలుగు), గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంపై సమీక్ష జరిపారు. సమీక్ష సమావేశంలో సీఎం జగన్ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో శానిటేషన్ చాలా ముఖ్యం. క్లాప్ (క్లీన్ ఆంధ్రప్రదేశ్).. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ జయంతి రోజు జూలై 8న ప్రారంభం అవుతుంది’ అని సీఎం జగన్ తెలిపారు. గ్రామాల్లో ఎక్కడా మురుగునీరు కనిపించకూడదని స్పష్టం చేశారు. సీవేజ్ పంపింగ్ ఎలా ఉంది? ఆ నీటిని ఎలా డిస్పోస్ చేయడం ఎలా అనేది చూడాలని అధికారులకు సూచించారు. మురుగునీటిని ట్రీట్మెంట్ ప్లాంట్లోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి మున్సిపాలిటీ, పంచాయతీలలో పారిశుద్ధ్య కార్మికులకు వాక్సినేషన్ మొదలు, యూనిఫామ్, గ్లౌజ్లు, మాస్క్లు, కోట్స్ అన్నీ అదనంగా ఇవ్వాలని స్పష్టం చేశారు. ‘మన ఊరును మనమే పరిశుభ్రంగా చేసుకుందాం’ అనే నినాదంతో జగనన్న స్వచ్ఛ సంకల్పం అమలుచేయాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ-వాహనాల నిర్వహణ భారం కాకుండా చూసుకోవాలని, గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలపైనే ఎక్కువ వ్యయం చేయాలని తెలిపారు. ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్’లో గ్రామాలు, పట్టణాల్లో పూర్తి పారిశుద్ధ్యం కోసం మున్సిపల్ విభాగం కూడా పంచాయతీరాజ్తో కలిసి పని చేయాలని సూచించారు. మనసా వాచా కర్మణా ఈ కార్యక్రమాన్ని సొంతం చేసుకోవాలని చెప్పారు. మే 1వ తేదీ నుంచి వంద రోజుల పాటు గ్రామాల్లో పారిశుద్ధ్యంపై కార్యాచరణ చేపడుతున్నట్లు సమావేశంలో అధికారులు వెల్లడించారు. వైఎస్సార్ జలకళ: ఈ పథకంలో రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల బోర్లు వేయాలని నిర్ణయం. చిన్న, మధ్య తరహా రైతులకు 1.5 లక్షల పంప్సెట్లు ఇవ్వాలని, దీంతో 3 లక్షల రైతులు ప్రయోజనం పొందుతారని అంచనా. 5 లక్షల ఎకరాలను సాగునీరు అందుతుందని లెక్క. బోర్ వేయాలని ఏ రైతు దరఖాస్తు చేసినా, ఎప్పుడు ఆ బోర్ వేస్తామన్నది స్పష్టంగా చెప్పాలి. దీనికి ఎస్ఓపీ ఖరారు చేయండి. ఇచ్చిన తేదీన కచ్చితంగా బోరు వేయాలి. ఆ తేదీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదు. తేదీ ఇస్తున్నామంటే, కేవలం బోరు వేయడం మాత్రమే కాదు. నీరు పడిన తర్వాత కచ్చితంగా నెల రోజుల లోపు, విద్యుత్ కనెక్షన్ ఇచ్చి, పంప్సెట్ బిగించాలి. సొంతంగా బోర్లు వేసుకున్న రైతులు ఎవరైనా పంప్సెట్లు కోరితే వారికి కూడా ఇవ్వండి. ఆ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, ఇంధన శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలి. ప్రతి నియోజకవర్గంలో నెలకు కనీసం 20 బోర్లు వేయాలి. గ్రామీణ తాగునీటి సరఫరా (జల్జీవన్ మిషన్- జేజేఎం): జగనన్న కాలనీల్లో కూడా ఈ కార్యక్రమం అమలు చేయాలి. నీటి వనరు, సరఫరా రెండూ ముఖ్యమే. జగనన్న కాలనీల్లో జల్జీవన్ మిషన్కు ప్రాధాన్యం ఇవ్వాలి. వేసవిలో నీటి వినియోగంపై ముందే పక్కాగా ప్రణాళిక సిద్ధం చేయాలి. ప్రతి గ్రామంలో ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఆ మేరకు ఏటా ఎప్పుడెప్పుడు, ఏయే ట్యాంకుల్ క్లీన్ చేయాలన్న దానిపై ఒక ప్రొటోకాల్ రూపొందించుకోండి. ఏటా వేసనికి ముందే అన్నీ పక్కాగా ప్లాన్ చేయాలి. ఏలూరు వంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. వీధుల్లో ఎల్ఈడీ లైటింగ్ (జగనన్న పల్లె వెలుగు): వీధి దీపాలు ఎల్ఈడీ వాడకంతో యేటా దాదాపు రూ.160 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. దాదాపు 4 లక్షల దీపాలు కావాలి. ఆ మేరకు కార్యాచరణ సిద్దం చేయండి. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు: ఏపీ రూరల్ రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టు (ఏపీఆర్ఆర్పీ)- ఈఏపీ 30 ఏళ్లుగా 30 వేల కి.మీ. బీటీ రోడ్లు మాత్రమే ఉండగా, మనం అధికారంలోకి వచ్చాక 10 వేల కి.మీ రహదారుల నిర్మాణం జరుగుతోందని అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పర్యావరణ అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ గిరిజాశంకర్, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్, మున్సిపల్ శాఖ స్పెషల్ శ్రీలక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు. చదవండి: కరోనా మూడో దశకు సిద్ధంగా ఉండాలె చదవండి: ఇప్పటివరకు లాక్డౌన్ ప్రకటించిన రాష్ట్రాలు ఇవే.. -
నష్టాల ప్రయాణం
వరంగల్ రీజియన్లో డిపోలు : 9 ఆర్టీసీ బస్సులు : 762 అద్దె బస్సులు : 230 బస్సులు రోజూ తిరిగే కిలోమీటర్లు : 3.91 లక్షలు నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులు : 10 లక్షలు రోజు సగటు ఆదాయం : రూ.1.15 కోట్లు హన్మకొండ: ఆర్టీసీ వరంగల్ రీజియన్ ప్రయాణం ఒడిదొడుకుల మధ్య సాగుతోంది. నష్టాలు, లాభాలతో ఎగుడు...దిగుడుల మధ్య ముందుకెళుతోంది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని డిపోలు, రీజియన్ల వారిగా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుంటూ లాభాలబాట పట్టించాలని గతంలో సీఎం కేసీఆర్ చేసిన సూచనల మేరకు అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో కొంతమేర సత్ఫలితాలు వచ్చాయి. వాస్తవానికి 2017 జనవరి నాటికి వరంగల్ రీజియన్ రూ.19.35 కోట్ల నష్టంలో ఉండేది. కానీ సంస్థాగతంగా చేపట్టిన చర్యలతో 2017 డిసెంబర్ నాటికి నష్టాల నుంచి పూర్తి స్థాయిలో గట్టెక్కి రూ.38 లక్షల లాభాల్లోకి వెళ్లింది. ఇలా 2017 సంవత్సరం భారీ నష్టాలతో మొదలై లాభాలతో ముగిసినప్పటికీ 2018 మొదటి నెలలోనే ఆర్టీసీ వరంగల్ రీజియన్ భారీ నష్టాలను చవిచూసింది. ఈ ఒక్క నెలలోనే రూ.3.54 కోట్ల నష్టం వాటిల్లడంతో షాక్ తిన్న ఆర్టీసీ రీజియన్ అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఆర్టీసీ వరంగల్ రీజియన్లోని 9 డిపోల్లో 992 బస్సులు ఉండగా ఇందులో 762 సంస్థ బస్సులు, 230 అద్దెబస్సులు ఉన్నాయి. రీజియన్లో ప్రతిరోజు ఈ బస్సులు 3.91 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయి. రోజుకు 10 లక్షల మంది ప్రయాణికులను వివిధ గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. ఇలా రోజుకు సగటున రూ.1.15 కోట్ల ఆదాయం వస్తోంది. పల్లెవెలుగు బస్సుల ద్వారా నష్టాలు ఎక్కువగా వస్తుండడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టాలనే ఆలోచనలో ఆర్టీసీ యాజమాన్యం ఉంది. నష్టాలను పూడ్చుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులను తగ్గించాలని నిర్ణయించినట్లు తెలిసింది. వారిని తొలగించినా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా, సేవలకు ఆటంకం కలగకుండా ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఏసీ బస్సుల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న అటెండెంట్లను తొలగించాలని నిర్ణయించినట్లు సమాచారం. హన్మకొండ–హైదరాబాద్ మధ్య నడిచే బస్సులు మధ్య స్టేజీల్లో నిలిపే అవకాశం లేనందున ప్రయాణికులకు కాజీపేట, హైదరాబాద్లోని ఉప్పల్లో వాటర్బాటిళ్లు, ఇతర వస్తువులు అటెండెంట్లను నియమించి అందించవచ్చని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. ఇలా ప్రతి బస్సుకు ఒక అటెండెంట్కు బదులు కాజీపేట, ఉప్పల్లో రెండు లేదా మూడు షిఫ్టుల్లో ఒక్కొక్కరిని నియమించి ప్రయాణికుల అవసరాలు తీర్చాలని చూస్తోంది. అయితే దూరప్రాంతాలకు వెళ్లే ఏసీ బస్సుల్లో అటెండెంట్లను మాత్రం కొనసాగించాలని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వరంగల్ రీజియన్లో 38 ఏసీ బస్సులున్నాయి. ఇందులో 15 వజ్ర ఏసీ మినీ బస్సులు. కొత్తగా వచ్చే 2 బస్సులతో రీజియన్లో మొత్తం 40 ఏసీ బస్సులు కానున్నాయి. ఈ బస్సుల్లో ప్రస్తుతం 30 మంది అటెండెంట్లు పనిచేస్తున్నారు. వారికి ఒక్కొక్కరికి నెలకు రూ.8,500 వేతనం చెల్లిస్తోంది. వీరిలో కనీసం 20 మందిని తొలగించాలనే ఆలోచనలో యాజమాన్యం ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఆర్టీసీ బస్సుల ద్వారా ఆదాయం పెంచుకునేందుకు అనువైన ప్రధాన రూట్లలో సెమీ ఎక్స్ప్రెస్లు నడపాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రైవేట్ వాహనాలకు ధీటుగా ప్రయాణికులను త్వరగా గమ్యస్థానం చేరవేయడం ద్వారా ఆర్టీసీ వైపు ప్రయాణికులను ఆకర్షించడంతోపాటు ఆదాయం పెంచుకోవాలన్నదే ఆర్టీసీ ఆలోచన. దీంతోపాటు మిని పల్లెవెలుగు బస్సులను నడపాలని చూస్తోంది. మినీబస్సులను వన్మన్ సర్సీస్గా నడుపుతారు. ఇందులో కండక్టర్ అవసరం ఉండదు. దీంతో మ్యాన్పవర్ కూడా తగ్గుతోంది. తద్వారా వేతన పెట్టుబడులు తగ్గుతాయి. పెద్ద ఎత్తున నష్టాల్లో ఉన్న మహబూబాబాద్ డిపో పరిధిలో మినీపల్లె వెలుగు బస్సులు ప్రవేశపెట్టి సత్ఫలితాలు సాధించింది. దీంతోపాటు జనగామ డిపోలోను కొన్ని రూట్లలో మినీబస్సులను ప్రవేశపెట్టి ఆదాయం పెంచుకోగలిగింది. ఈ క్రమంలో రీజియన్లోని మరికొన్ని డిపోల్లో ఆదాయం పెంచుకునేందుకు అనువుగా ఉన్న రూట్లలో మినీ పల్లెవెలుగు బస్సులు నడపాలనే ఆలోచనలో యాజమాన్యం ఉంది. ఈ మేరకు వరంగల్ రీజియన్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. పల్లె వెలుగు రూట్లపై ప్రత్యేక దృష్టి.. వరంగల్ రీజియన్లో ఆదాయం పెంచుకునే దిశగా ఆలోచన చేస్తున్నాం. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాం. తమ ప్రణాళికలు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి అనుమతి తీసుకుంటాం. ఆ తర్వాత అమలు చేస్తాం. ప్రధానంగా పల్లెవెలుగు బస్సులు నడిచే రూట్లలో ఆదాయం పెంచుకునేలా ప్రణాళికలు తయారు చేస్తాం. అనవసర ఖర్చులు తగ్గించుకుంటాం. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం. నష్టాలు పూడ్చుకునేందుకు ఆనువైన మార్గాలు ఎంచుకుని ముందుకు పోతాం. – తోట సూర్యకిరణ్, ఆర్ఎం, వరంగల్ రీజియన్ -
పల్లె వెలుగు బస్సును నడిపిన మంత్రి
బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ- బీర్కూరు మధ్య నూతన మినీ పల్లె వెలుగు బస్సును స్వయంగా రాష్ట్ర మంత్రి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి నడిపి ప్రారంభించారు. అనంతరం బాన్సువాడ బస్టాండులో రూ. 10 లక్షలతో నిర్మించే అదనపు ఫ్లాట్ ఫాంలకు శంఖుస్థాపన చేశారు. అలాగే, మిషన్ కాకతీయ -3లో భాగంగా రూ.86.95 లక్షలతో బాన్సువాడ మండలం రాంపూర్ చెరువు పునరుద్దరణ పనులను ప్రారంభించారు. -
ఊరూరికీ 'పల్లె వెలుగు'
డిచ్పల్లి: తెలంగాణలోని గ్రామగ్రామానికీ పల్లె వెలుగు బస్సు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామ ని రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి తెలి పారు. శుక్రవారం శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డితో కలిసి ఆయన నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా డిచ్పల్లి టీఎస్ఎస్పీ ఏడో బె టాలియన్లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం లో ఆర్టీసీ బస్సులు వెళ్లని 1,300 గ్రామాలను గుర్తించామన్నారు. అన్ని గ్రామాలకు బస్సులు వెళ్లడానికి అవసమైన రోడ్లు వేయించేలా కృషి చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఇటీవలే రవాణా శాఖకు రూ. 150 కోట్లు నిధులు మంజూరు చేశారన్నారు. అనంతరం శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రి మహేందర్రెడ్డి బెటాలియన్ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. అంతకు ముందు వారికి బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ అమృతరావు స్వాగతం పలికారు. -
ఇవన్నీ ప్రభుత్వ తప్పిదాలు కావా ?
-
ప్రమాదం అంచున ప్రయాణం.
పట్నంబజారు (గుంటూరు) : అధికారులు అన్ని విషయాల్లో నిబంధనలు అంటూ మంకుపట్టు పట్టడం వివేకం అనిపించుకోదు. కొన్నికొన్ని విషయాల్లో మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం నెలవారీ పాసులు ఎక్స్ప్రెస్ బస్సుల్లో చెల్లవు. కానీ ఉదయం వేళల్లో విద్యార్థులు కళాశాలలకు వెళ్లే సమయంలో ఉన్న ప్యాసింజర్ సర్వీసులు చాలక ఫుట్పాత్లపై వేలాడుతూ ప్రమాదం అంచున ప్రయాణం చేస్తుండడం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. గుంటూరు నగరం పరిసర ప్రాంతాల్లో దాదాపు 20 పైగా ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. కొందరు కళాశాలల బస్సుల్లో వెళుతున్నా... అలా వీలుపడని వారికి ఆర్టీసీ బస్సులే శరణ్యం. ఆటోలైతే మరీ డేంజరు... కదా అని ఆర్టీసీ బస్సు ఎక్కుదామంటే నెలవారీ పాసుల వారికి ఎక్స్ప్రెస్ బస్సులు నిషిద్ధం. ఇక గతిలేక ఊపిరాడని రద్దీలో పల్లెవెలుగు బస్సులోనే ప్రయాణం తప్పనిసరి. భావి భారత ఇంజినీర్లకు ఇక్కడ నుంచే కష్టాలు మొదలవుతాయి. ఈ బస్సుల్లో ప్రయాణం దినదినగండమే. ఆ రోజు క్షేమంగా చేరితే చేరినట్టు. చాలీచాలని సర్వీసులు... విద్యా సంవత్సరం ప్రారంభమైంది. నిత్యం వందలాది మంది విద్యార్థులు ఇతర ప్రాంతాల్లో ఉన్న కళాశాలలు, పాఠశాలలకు వెళుతుంటారు. వీరిలో అత్యధిక శాతం మంది ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేస్తుంటారు. అయితే పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్న చందంగా ఆర్టీసీ అధికారుల తీరు ఉంది. ఆర్టీసీ అధికారులు విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. విద్యార్థులు ఫుట్పాత్లపై నిలబడి ప్రయాణం చేస్తూ ప్రాణాలనే పణంగా పెట్టి ప్రయాణం చేస్తున్నా... పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి నిత్యం ఉదయం 6.30 గంటల నుంచి 9 గంటల వరకు వందలాది మంది విద్యార్థులు కళాశాలలకు వెళుతుంటారు. కొంతమంది విద్యార్థులు ఆటోల్లోనూ, మరికొంతమంది కళాశాల బస్సుల్లోనూ ప్రయాణం చేస్తుండగా, అధిక శాతం మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. తెనాలి, న రసరావుపేట, చిలకలూరిపేట, నల్లపాడు, ప్రత్తిపాడు, విజయవాడ ప్రాంతాల్లో అధికంగా ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఉదయం సమయంలో ఆయా ప్రాంతాలకు అధికంగా సర్వీసులు లేకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళాశాలకు ఆలస్యం అయిపోతోందన్న తొందర్లో ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. పల్లె వెలుగు బస్సుల్లోనే విద్యార్థులను అనుమతిస్తామని చెప్పడం, ఆ సమయంలో పల్లె వెలుగు బస్సు సర్వీసులు సరిపడా ఉండకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు చెప్పినా... పట్టించుకోని సిబ్బంది ఆర్టీసీ ఉన్నతాధికారులు ఎక్స్ప్రెస్ బస్సుల్లో సైతం కొద్దిమొత్తాన్ని చెల్లించి విద్యార్థులను తీసుకుపోవాలని చెబుతున్నా, సిబ్బంది మాత్రం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి చెందిన విద్యార్థి ఇలాగే ఫుట్పాత్పై నిలబడి జారిపడి ప్రాణాలను కోల్పోయాడు. అప్పట్లో విద్యార్థులంతా బైపాస్లో రాస్తారోకో నిర్వహించి అధికారుల తీరును ఎండగట్టారు. ప్రత్తిపాడు సమీపంలోని పుల్లడిగుంటలో ఉన్న ఒక ఇంజినీరింగ్ కాలేజి విద్యార్థి ఫుట్పాత్ మీద నుంచి కిందపడి గాయాలపాలైన సంఘటన ఇటీవలి కాలంలోనే జరిగింది. దీనిపై ఆర్టీసీ ఉన్నతాధికారులకు విద్యార్థులు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభమైన తరుణంలో బస్సుల సర్వీసులను పెంచాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. నెలవారీ పాసులు ఉన్న విద్యార్థులను కళాశాలల సమయంలో ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ అనుమతి కల్పించాలని కోరుతున్నారు. గతంలో జరిగిన పరిణామాలను చూసైనా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, కేవలం ఆర్భాటపు ప్రకటనలు చేయకుండా, కార్యాచరణపై దృష్టి సారించాలని కోరుతున్నారు. సర్వీసులను పెంచుతున్నాం విద్యార్థుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పలు ప్రాంతాలవైపు సర్వీసులను పెంచేందుకు దృష్టి సారిస్తున్నాం. ఇప్పటికే చిలకలూరిపేట మార్గంలో సర్వీసులను అభివృధ్ధి పరిచాం. నరసరావుపేట, తెనాలి, విజయవాడ మార్గాల్లో అధికారుల ద్వారా సర్వే నిర్వహించి సర్వీసుల పెంపుపై నిర్ణయం తీసుకుంటాం. విద్యార్థులను ఎక్స్ప్రెస్ల్లో అనుమతించని కండక్టర్, డ్రైవర్లపై చర్యలు తీసుకునేందుకు ఏ మాత్రం వెనుకాడబోం. ఏడు రూపాయలు చెల్లించి ఎక్స్ప్రెస్ బస్సుల్లో విద్యార్థులు ప్రయాణించేందుకు చర్యలు తీసుకున్నాం. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పూర్తి స్థాయిలో సర్వీసులను అధికం చేయనున్నట్టు తెలిపారు. - పి.వి.రామారావు, ఆర్ఎం, ఆర్టీసీ