మంత్రి పల్లె సోదరుని మృతి | Minister palle Raghunatha Reddy brother passed away | Sakshi
Sakshi News home page

మంత్రి పల్లె సోదరుని మృతి

Oct 25 2016 4:40 PM | Updated on Aug 29 2018 7:39 PM

మంత్రి పల్లె సోదరుని మృతి - Sakshi

మంత్రి పల్లె సోదరుని మృతి

ఏపీ సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోదరుడు పల్లె వెంకటసుబ్బారెడ్డి మృతి చెందారు.

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోదరుడు పల్లె వెంకటసుబ్బారెడ్డి మంగళవారం మృతిచెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంగా ఉన్న ఆయన మంగళవారం ఉదయం అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం పల్లెవాండ్లపల్లిలో తుదిశ్వాస విడిచారు. సోదరుని మరణవార్త తెలిసిన వెంటనే మైసూరులో అధికార పర్యటనలో ఉన్న మంత్రి పల్లె రఘునాథరెడ్డి హుటాహుటిన పల్లెవాండ్లపల్లె చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం పల్లె సోదరుని అంత్యక్రియలు జరిగాయి. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement