దేశద్రోహం కేసులో అరెస్టు
5 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీ
ఎగ్మూరు కోర్టు ఆదేశం
సాక్షి, చెన్నై : ఎండీఎంకే నేత వైగో మళ్లీ కట కటాల్లోకి వెళ్లారు. దేశద్రోహం కేసులో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం 15 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఎగ్మూర్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలతో ఆయన్ను పుళల్ జైలుకు తరలించారు. బెయిల్కు అవకాశం కల్పించినా, వైగో తిరస్కరించారు. ఒకప్పుడు డీఎంకే ప్రచార ఫిరంగిగా తన వాక్ధాటితో తమిళ రాజకీయాల్లో వైగో ఓ వెలుగు వెలి గారు. డీఎంకే నుంచి బయటకు వచ్చి ఎండీఎంకే ఆవిర్భావంతో కష్టాలు తప్పలేదు.
తొలి నాళ్లల్లో ఆదరణ లభిం చినా, క్రమంగా కేడర్ మళ్లీ మాతృగూటికి చేరడంతో తంటాలు ఎదుర్కొంటూ, పార్టీని నెట్టుకు వస్తున్నారు. అయితే, ఎల్టీటీఈలకు వీరవిధేయుడిగా వ్యవహరిస్తూ, తరచూ వివాదాల్ని కొని తెచ్చుకుంటున్నారని చెప్పవచ్చు. వివాదాలు, వివాదాస్పద వ్యాఖ్యల్లో ముందుండే వైగో తరచూ జైలు జీవి తాన్ని గడపక తప్పలేదు. 2001లో ఎల్టీటీఈలకు మద్దతుగా వివా దాస్పద వ్యాఖ్యలు చేసి వేలూరు కేంద్ర కారాగారంలో 19 నెలల పాటుగా జైలు జీవితాన్ని అనుభవించారు.
2009లో శ్రీలంకలో యుద్ధం సాగుతున్న సమయంలో వైగో స్పందించిన తీరు, మాటల తూటాలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. ఆయన మీద దేశద్రోహం కేసు నమోదు అయింది. తొమ్మిది సంవత్సరాలుగా ఈ కేసు విచారణను వైగో ఎదుర్కొంటూ వస్తున్నారు. ఎగ్మూర్ మేజిస్ట్రేట్ కోర్టులో సాగుతున్న విచారణకు స్వయంగా హాజరై వాదనల్ని వినిపిస్తూ వస్తున్నారు. సోమవారం న్యాయమూర్తి గోపీనాథ్ ముందు జరిగిన విచారణలో వైగో తన వాదనలో ఎల్టీటీఈకి మద్దతును సమర్థించుకున్నారు. గతంలో వైగో వివాదాస్పద, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్టుగా ఆధారాలు ఉన్నట్టు ఈసందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదన వినిపించారు.
ఈ సమయంలో వైగో స్పందిస్తూ, నాడు, నేడు, రేపు ఎల్లప్పుడు ఎల్టీటీఈలకు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాననని, తన ధో?రణిలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. దీంతో ధోరణి మారని పక్షంలో జైలుకు వెళ్లాల్సి ఉంటుందని న్యాయమూర్తి హెచ్చరించారు. ఇందుకు తాను సిద్ధం అని వైగో వ్యాఖ్యానించడంతో 15 రోజుల జుడీషియల్ కస్టడీకి ఆదేశాలు జారీ అయ్యాయి.
అయితే, వైగోకు బెయిల్ అవకాశాన్ని కోర్టు కల్పించింది. తనకు బెయిల్ వద్దు అని, జైలు శిక్షను అనుభవించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వైగో స్పష్టం చేశారు. దీంతో ఆయన్ను అరెస్టు చేసిన పోలీసులు పదిహేను రోజుల జుడీషియల్ కస్టడీ నిమిత్తం పుళల్ కేంద్ర కారాగారానికి తరలించారు.
కటకటాల్లో.. వైగో
Published Tue, Apr 4 2017 11:58 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
Advertisement