7నుంచి కోస్తా జిల్లాల్లో పర్యటన | kosta district tour from 7th | Sakshi
Sakshi News home page

7నుంచి కోస్తా జిల్లాల్లో పర్యటన

Oct 26 2016 10:51 PM | Updated on Sep 4 2017 6:23 PM

మహానందీశ్వరస్వామి దర్శనార్థం వచ్చిన కమిటీ సభ్యులు

మహానందీశ్వరస్వామి దర్శనార్థం వచ్చిన కమిటీ సభ్యులు

నవంబరు 7 నుంచి కోస్తా ప్రాంతంలో పర్యటిస్తామని మంజునాథన్‌ కమిటీ సభ్యులు తెలిపారు.

– మహానందిలో మంజునాథన్‌ కమిటీ సభ్యుల పూజలు 
 
మహానంది: కోస్తా ప్రాంతంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో నవంబరు 7 నుంచి పర్యటిస్తామని మంజునాథన్‌ కమిటీ సభ్యులు పూర్ణచంద్రరావు, వెంకటసుబ్రమణ్యం, సత్యనారాయణ తెలిపారు. మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు బుధవారం మహానందికి వచ్చారు. దేవస్థానం పాలకమండలి చైర్మన్‌ పాణ్యం ప్రసాదరావు, ఈఓ డాక్టర్‌ శంకర వరప్రసాద్‌లు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో పర్యటించామన్నారు. కర్నూలు జిల్లాలో పాములపాడు మండలంలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఎవరైనా తమ వాదనలు వినిపించాలన్నా, అభిప్రాయాలు చెప్పాలన్నా నేరుగా కలిసి వినిపించవచ్చని అన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement