కోలీవుడ్లో ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే తాజా సమాచారం. అదే గనుక జరిగితే తమిళ తెరపైనే కాదు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పైనే వండర్ క్రియేట్ అవుతుంది. అంత బ్రహ్మాండమైన విషయం ఏమిటంటారా? తమిళ చిత్ర పరిశ్రమలో ధృవ నక్షత్రాలైన ఆ ఇద్దరినీ కలసి నటించే ప్రయత్నాలు మొదలయ్యాయని కోలీవుడ్ టాక్. ఆ దిగ్గజాలు విశ్వనాయకుడు కమలహాసన్, సూపర్స్టార్ రజనీకాంత్. వీరిని ఒకే చిత్రంలో హీరో, విలన్గా చూపే భగీరథ ప్రయత్నం జరుగుతోంది. వారిలో ఎవరు హీరో? ఎవరు విలన్ అని ఊహించగలరా? సకల కళా వల్లభుడు కమలహాసన్ హీరోగా నటిస్తే పెద్దగా విశేషం ఏముంటుంది.
అందుకే ఆయన్ని ప్రతి నాయకుడిగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక సూపర్స్టార్ ఈ రోజుల్లో విలన్గా ఉంచలేం. ఎందిరన్లో నటించారుగా అంటారా? ఆ చిత్రంలో హీరో, విలన్ రెండూ ఆయనే. ఇంతకీ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి ప్రయత్నిస్తున్న సత్తా వున్నా దర్శకుడు శంకర్. కాస్త విపులంగా చెప్పాలంటే లింగా చిత్రం సృష్టించిన సమస్యలతో తలబొప్బి కట్టిన సూపర్స్టార్ తన కో చిత్రం చేయమని శంకర్ను కోరినట్లు సమాచారం. అందుకు అంగీకరించిన ఈ స్టార్ డెరైక్టర్ ఒక బ్రహ్మాండమైన కథను వినిపించారట. అది రజనీకి పిచ్చి పిచ్చిగా నచ్చేసిందట.
ఆ కథలో మరో సూపర్ విలన్ పాత్ర ఉంటుందట. ఆ పాత్రలో కమలహాసన్ నటిస్తే బాగుంటుందని శంకర్ ఆలోచన. ఈ మల్టీస్టారర్ చిత్రంలో నటించడానికి మొదట నో చెప్పిన కమల్ ఆ తరువాత ఆలోచించి చెబుతానని మాటిచ్చారట. ఒకవేళ కమల్ గనుక రజనీకి విలన్ అవ్వడానికి అంగీకరిస్తే ఆ చిత్రం ఒక సంచలనం అవుతుంది. కమల్, రజనీ చివరిగా నినైత్తాల్ ఇనిక్కుమ్ చిత్రంలో కలసి నటించారు. ఆ చిత్రం తెరపైకి వచ్చి 36 ఏళ్లు అవుతోంది.
రజనీకి విలన్గా కమలహాసన్?
Published Fri, Apr 17 2015 1:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement