పిల్లలు సహా దంపతుల ఆత్మహత్యాయత్నం


కుటుంబసభ్యుల మధ్య విభేదాల నేపథ్యంలో ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. గంగాధర మండలం గర్షకుర్తికి చెందిన భూమేష్‌కు తండ్రితో కొంతకాలంగా తగాదాలు జరుగుతున్నాయి. కరీంనగర్‌లో వారికి ఉన్న దుస్తుల దుకాణం లావాదేవీల్లో విభేదాలే ఈ గొడవలకు కారణం. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి భూమేష్, అతని భార్య మంజుల, పిల్లలు కుమార్తెలకు విషం కలిపిన కూల్ డ్రింక్ తాగారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఐదుగురినీ కుటుంబసభ్యులు గమనించి వేకువజామునే కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారికి ఎటువంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top