విషాహారం తిని చిన్నారి మృతి | Eating poison and killing baby | Sakshi
Sakshi News home page

విషాహారం తిని చిన్నారి మృతి

Jul 19 2017 4:31 AM | Updated on Sep 18 2018 7:36 PM

విషాహారం తిని చిన్నారి మృతి - Sakshi

విషాహారం తిని చిన్నారి మృతి

కలుషిత నీటిని తాగి తొమ్మిది నెలల కిందట ఆరుగురు మృతి చెందిన సంఘటన మరువకముందే అదేగ్రామంలో మరో చిన్నారి విషాహారం తినడంతో మంగళవారం ఉదయం మృతి చెందింది.

తిరువణ్ణామలై: కలుషిత నీటిని తాగి తొమ్మిది నెలల కిందట ఆరుగురు మృతి చెందిన సంఘటన మరువకముందే అదేగ్రామంలో మరో చిన్నారి విషాహారం తినడంతో మంగళవారం ఉదయం మృతి చెందింది. తిరువణ్ణామలై జిల్లా విరివూర్‌ సమీపం తండరై గ్రామానికి చెందిన ఆంథోని విమల్‌రాజ్‌ కుమారుడు శరణ్‌(4)కు సోమవారం మధ్యాహ్నం భోజనం అనంతరం వాంతులు, విరోచనాలు ఏర్పడ్డాయి.

. దీంతో హుటాహుటిన తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్క డ చికిత్సలు ఫలించక మంగళవారం మధ్యాహ్నం శరణ్‌ మృతి చెందాడు. దీని పై వైద్యులు మాట్లాడుతూ విషతుల్య మైన ఆహారం తినడంతోనే చిన్నారి మృ తి చెందినట్టు తెలిపారు. ఇదే గ్రామంలో గతేడాది అక్టోబర్‌లో తాగునీరు కలుషి తం కావడంతో ఆ నీటిని తాగి 6మంది మృతిచెందారు.

Advertisement
 
Advertisement
Advertisement