జిల్లా పంచాయతీ, తాలూకా పంచాయతీలకు జరిగిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
రెండు చోట్లా కాంగ్రెస్ గెలుపు
Oct 2 2013 3:47 AM | Updated on Mar 18 2019 9:02 PM
గంగావతి, న్యూస్లైన్ : జిల్లా పంచాయతీ, తాలూకా పంచాయతీలకు జరిగిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. జిల్లాలోని హిట్నాళ్ జిల్లా పంచాయతీ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కే.రమేష్ హిట్నాళ్ గెలుపొందాడు. ఆయన సమీప ప్రత్యర్థి నింగనగౌడ బేవూరుపై 6,585 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కొప్పళ ఎమ్మెల్యే రాఘవేంద్ర హిట్నాళ్, తన సోదరుడు కే.రమేష్ హిట్నాళ్ గెలుపొందడంతో కౌంటింగ్ సెంటర్కు వచ్చి అతనితో కలిసి ప్రమాణ పత్రాన్ని స్వీక రించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కౌంటింగ్ కేంద్రం వద్ద పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి రంగులు జల్లుకుని ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. అలాగే గంగావతి తాలూకాలోని చిక్కడంకనకల్లు తాలూకా పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శారదమ్మ తన సమీప బీజేపీ అభ్యర్థి యంకమ్మపై గెలుపొందారు. శారదమ్మకు 2,652 ఓట్లు లభించగా, యంకమ్మ 1656 ఓట్లు లభించాయి.
Advertisement
Advertisement