ఇక పై విభిన్న నందితను చూస్తారంటోంది నందిత. అట్టకత్తి చిత్రం ద్వారా కోలీవుడ్లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ తమిళ ప్రేక్షకుల నుంచి పక్కింటి అమ్మాయిగా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం చేతిలో రెండు మూడు చిత్రాలతో బిజీగా ఉన్న నందిత త్వరలో హార్రర్ చిత్రంలో భయపెట్టడానికి సిద్ధం అవుతోంది. యువనటుడు శివ హీరోగా నటించనున్న ఈ చిత్రం ఏప్రిల్లో సెట్పైకి రానుంది. ప్రస్తుతం రాధామోహన్ దర్శకత్వంలో ఉప్పుకరువాడు చిత్రంతో పాటు భరత్బాలా శిష్యుడు రాజశేఖర్ మోగాఫోన్ పట్టిన నూతన చిత్రంలో నటిస్తోంది.
వీటి గురించి నందిత మాట్లాడుతూ ఇప్పటి వరకు పక్కింటి అమ్మాయిగా చూసిన తనను ఇకైపై విభిన్న పాత్రల్లో చూస్తారంది. ఉప్పుకరువాడు చిత్రంలో తన పాత్రను దర్శకుడు రాధామోహన్ చాలా కొత్తగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొంది. నవ దర్శకుడు రాజశేఖర్ చిత్రంలో నాగరికతతో కూడిన గ్లామరస్ పాత్రను పోషిస్తునట్లు చెప్పింది. ఈ పాత్రలో తాను కలర్ఫుల్ దుస్తుల్లో చాలా అందంగా కనిపిస్తానని నందిత చెబుతోంది.
# Tag
Related news
-
ESI scam: అవినీతి మరక.. అచ్చెన్నకు ఎరుక
కార్మిక శాఖ మంత్రి అంటే కార్మికులకు న్యాయం చేయాలి. కానీ అచ్చెన్నాయుడు రూటే సెప‘రేటు’. శ్రామిక సోదరుల కోసం కొనాల్సిన మందుల్లోనూ దందా నడిపారు. వైద్యపరికరాలు ఎక్కువ ధరకు కోట్ చేసి, బినామీలను తెర మీదకు తెచ్చి, మందు బిల్లుల్లో మాయలు చేసి రూ.150 కోట్ల అక్రమానికి పాల్పడి అవినీతి మంత్రిగా ముద్ర పడ్డారు. ఈఎస్ఐ స్కామ్లో అరెస్టయ్యి జిల్లా పరువు తీసేశారు. మంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో దొరికిందే చాన్స్ అంటూ దోచుకున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఈఎస్ఐ స్కామ్.. అచ్చెన్నాయుడు ఎన్నటికీ చెరపలేని అవినీతి మరక. మన జిల్లాకు చెందిన నాయకుడు రాష్ట్ర స్థాయిలో భారీ అవినీతికి పాల్పడిన వ్యవహారం మాయని మచ్చగా మిగిలిపోయింది. అధికారులను బెదిరించడం, అవసరమైతే బదిలీ చేయడం, తనకు కావల్సిన వారిని తెప్పించుకుని అక్రమాలకు పాల్పడటం టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం సాగిపోయింది. అంతటితో ఆయన లీలలు ఆగలేదు. కార్మికుల కోసం కొనుగోలు చేసిన మందుల్లోనూ అవినీతికి పాల్పడ్డారు. దాదాపు రూ.150కోట్లకు పైగా జరిగిన స్కామ్లో సూత్రధారిగా నిలిచారు. కారి్మకుల సొమ్ము కాజేసిన అచ్చెన్న బండారం విజిలెన్స్ అధికారుల విచారణలో బయటపడింది. వైద్య పరికరాలు, మందుల కొనుగోళ్ల పనులు నామినేషన్పై అప్పగించాలని మంత్రి హోదాలో కింజరాపు అచ్చెన్నాయుడు ఇచ్చిన సిఫారుసు లేఖతో మొత్తం గుట్టు రట్టయ్యింది. వైద్య పరికరాలు, ఔషధాలను బేరమాడి తక్కువకు కొనాల్సింది పోయి సగటున 132శాతం అధికంగా చెల్లించి కోట్లు కొట్టేశారు. అచ్చెన్న అవినీతి మార్క్ కారి్మక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో అచ్చెన్న తన మార్క్ అవినీతిని చూపించారు. ఈఎస్ఐ ఆస్పత్రులకు అవసరమైన మందులు, వైద్య పరికరాల కొనుగోలు కాంట్రాక్ట్ను తాను చెప్పిన సంస్థకు నామినేటేడ్ కట్టబెట్టాలని సంబంధిత అధికారులకు లిఖిత పూర్వగా ఆర్డర్ జారీ చేశారు. సిఫార్సుకు ముందు వారితో ఏ లాలూచీలు పడ్డారో తెలీదు గానీ తన లెటర్ హెడ్ ద్వారా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో తూచా తప్పకుండా అధికారులు పాటించారు. నామినేటేడ్లో కాంట్రాక్ట్ దక్కించుకున్న ఆ సంస్థ ప్రతినిధులు తర్వాత అనేక అక్రమాలకు పాల్పడ్డారు. నకిలీ ఇండెంట్లతో పెద్ద ఎత్తున నిధులు స్వాహా చేశారు. పక్కా ఆధారాలతో ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడును అరెస్టు కూడా చేశారు. అవినీతి జరిగిందిలా... 👉రూ. 293.51కోట్ల విలువైన మందులకు కొనుగోలు కేటాయింపులు చేయగా పరిమితికి మించి రేట్ కాంట్రాక్ట్ లేని సంస్థల నుంచి ఏకంగా రూ.698.36కోట్లు విలువైన ఔషధాలు కొనుగోలు చేశారు. 👉శస్త్ర చికిత్స పరికరాలకు టెండర్లు లేకుండా రూ.6.62కోట్లు మేర చెల్లించారు. వాస్తవ ధర కంటే ఇది 70శాతం అధికం. 👉ఫ్యాబ్రికేటేడ్ కొటేషన్స్ సృష్టించి రేటు కాంట్రాక్టులో లేని సంస్థలకు ఆర్డర్లు ఇచ్చారు. రాశి ఫార్మా, వీరేష్ ఫార్మా సంస్థలకు కొనుగోలు ఆర్డర్ల కంటే అదనంగా రూ. 15.93కోట్లు చెల్లించారు. ఇందులో రూ.5.70కోట్లు మేర అదనంగా చెల్లించినట్టు తేలింది. 👉 కోట్లు వెచ్చించి కొన్న వందల పరికరాలను వినియోగించకుండా మూలనపడేశారు. జెర్సన్ ఎంటర్ ప్రైజెస్ అనే బినామీ సంస్థకు ఈఎస్ఐ డైరెక్టర్ డాక్టర్ సీకే రమే‹Ùకుమార్ రూ. 9.50కోట్లు చెల్లించారు. 👉 ఒక్కో బయోమెట్రిక్ పరికరం ధర రూ.16,992 అయితే రూ.70,760చొప్పున నకిలీ ఇండెంట్లు సృష్టించి కొనుగోలు చేశారు. 👉 ఈ క్రమంలో రశీదులు ఫోర్జరీ చేసి కోట్లు కొల్లగొట్టారు. నకిలీ కొటేషన్లు సృష్టించి రేటు కాంట్రాక్ట్లో లేని సంస్థలకు ఆర్డర్లు ఇచ్చారు. ల్యాబ్ కిట్లు, ఫరీ్నచర్, ఈసీజీ సరీ్వసులు, బయోమెట్రిక్ పరికరాల కొనుగోలులో భారీగా అక్రమాలు జరిగాయి. 👉 లేని సంస్థల నుంచి మందులు కొనుగోలు చేసినట్టు నకిలీ ఇండెంట్లు సృష్టించారు. ప్రభుత్వం రూ.89కోట్లు చెల్లిస్తే అందులో రేట్ కాంట్రాక్ట్లో ఉన్న సంస్థలకు రూ. 38కోట్లు చెల్లించారు. మిగతా రూ.51కోట్లను దారి మళ్లించారు. 👉టెండర్లు లేకుండా నామినేషన్ కింద ఆర్డర్లు ఇవ్వడంతో కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము దురి్వనియోగమైంది. అవుట్ సోర్సింగ్ దందా సాధారణంగా ఔట్ సోర్సింగ్ పోస్టులకు అవసరమైన అభ్యర్థులను సమకూర్చే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీని కలెక్టర్ నియమించాలి. జిల్లా స్థాయిలో నోటిఫికేషన్ ఇచ్చి, అర్హత గల ఏజెన్సీలు దరఖాస్తు చేస్తే, వాటిలో సరైనదేదో నిర్ధారణ చేసుకుని ఎంపిక చేస్తారు. కానీ గత ప్రభుత్వంలో టీడీపీ నేతలను ఏజెన్సీలుగా నియమించి దందా చేశారు. కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి స్థాయిలోనే ఏ శాఖకు, ఏ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ఉండాలి, ఆ ఏజెన్సీ ఎవరి చేతిలో ఉండాలన్నది ఫిక్స్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతటితో ఆగలేదు. బినామీ ఏజెన్సీల ముసుగులో స్థానిక నేతలు చెలరేగి పోయి ఔట్ సోర్సింగ్ పోస్టులకు బేరసారాలు సాగించారు. ఒక్కో పోస్టును రూ. 2లక్షల నుంచి రూ. 3లక్షల వరకు అమ్ముకున్న దాఖలాలు ఉన్నాయి. అచ్చెన్నపై నమోదు చేసిన కేసులివే.. 👉అవినీతి నిరోధక శాఖలో పలు సెక్షన్ల కింద అచ్చెన్నాయుడిపై కేసులు నమోదు చేశారు. క్రైమ్ నంబర్ 04/ఆర్సీఓ– సీఐయూ– ఏసీబీ/2020 యు/ఎస్ 13(1), (సీ), (డీ), ఆర్/డబ్ల్యూ 13(2) ఏసీబీ పీసీ సవరణల చట్టం–2018, ఏసీబీలోని ఐపీసీ సెక్షన్ల ప్రకారం సెక్షన్ 408, సెక్షన్ 420, 120–బీ కింద అచ్చెన్నాయుడిపై అధికారులు కేసు నమోదు చేశారు. 👉రూ. 975.79కోట్ల విలువైన మందులతో పాటు వైద్య పరికరాల కొనుగోలులో సుమారుగా రూ.150కోట్ల పైన అవినీతి అక్రమాలు జరిగినట్టు ఏసీబీ తేలి్చంది. 👉ఆస్పత్రులకు అవసరమైన మందులు, ఔషధాలు, వైద్య ఉపకరణాలు, ఆపరేషన్లకు అవసరమైన పరికరాలు, ల్యాబ్ కిట్స్, ఫరీ్నచర్ పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. రూ. 975.79కోట్ల రూపాయల మేర కొనుగోలు జరిగాయి. అయితే ఈ ప్రక్రియలో యథేచ్ఛగా నియమాలు, మార్గదర్శకాలను ఉల్లంఘించారు. 👉నిబంధనల ప్రకారం ఉండాల్సిన డ్రగ్ ప్రొక్యూర్మెంట్ కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. కొనుగోళ్ల ప్రక్రియలో ఎక్కడా ఓపెన్ టెండర్లు కూడా పిలవలేదు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడింది. మొదటి నుంచీ అదే బాగోతం రాష్ట్ర స్థాయిలోనే కాదు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. గ్రానైట్, ఇసుక కుంభకోణాలు, బీసీ కార్పొరేషన్ రుణాల్లో అక్రమాలు, సింగిల్ టెండర్ విధానంతో సొంత అన్నకు టెండర్లు కట్టబెట్టడం, ధాన్యం రవాణాకు వచ్చిన కోట్లాది రూపాయలు సొంత ఖాతాలకు మళ్లించుకోవడం, మినుముల కుంభకోణంతో కోట్ల రూపాయలు సొంత ఖాతాలకు మళ్లించుకోవడం, టెక్కలిలో సింగిల్ టెండర్ విధానంతో తన బినామీ లాడి శ్రీనివాసరావుకు ఆర్టీసీ టెండర్లు కట్టబెట్టడం, దివాకర్ ట్రావెల్స్కు అడ్డగోలుగా రవాణా లైసెన్సులు జారీ చేయడం వంటి ఆరోపణలను అచ్చెన్న మూటగట్టుకున్నారు. -
సాంఘిక విప్లవ నాయకుడు
ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డికి లభి స్తున్న అపూర్వ ప్రజా స్పందనను చూస్తుంటే... తెలుగు రాష్ట్రాలను ఇంతవరకూ పాలించిన ముఖ్యమంత్రులెవరికీ ఇంతటి ప్రజాదరణ లేదని పిస్తోంది. దీనికంతటికీ ఆయన ప్రజల కోసం చేసిన పనులే కారణం అన్నది స్పష్టం. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు సంక్షేమ పథకా లను ప్రవేశపెట్టి వాటిని అవసరమున్న ప్రజలకు అందజేయడం మంచి పాలకుల లక్షణం. మధ్య దళారుల వ్యవస్థ లేకుండా వారికి అందజేయవలసిన డబ్బును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసి అవినీతికి ఏమాత్రం అవకాశం లేకుండా చేసిన ఘనత జగన్దే. ప్రజాస్వామ్యానికి సరైన నిర్వచనమైన ‘ప్రజల యొక్క, ప్రజల కొరకు. ప్రజల చేత’ పాలన సాగించడం జగన్ సాధించిన అద్భుత విజయం. గ్రామ వలంటీర్ వ్యవ స్థను ప్రవేశపెట్టి ప్రజల ముంగిట్లోకి పాలనను, ప్రభుత్వ పథకాలను చేరేట్టు చేయడం మరో గొప్ప విజయం. కార్పొరేట్ శక్తులు, రాజకీయ అహంభావ నిరంకుశ శక్తులను మినహాయిస్తే... జగన్ వల్ల లాభపడని ఒక్క కుటుంబమూ ఆంధ్రప్రదేశ్లో కనబడదు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిన కుటుంబానికి ఆర్థిక సాయం చేయడమే కాకుండా... పిల్లలకు ఉచితంగా నాణ్యమైన ఆంగ్లమాధ్యమ విద్యను అందిస్తున్న ఘనత జగన్దే. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కార్పొరేట్ విద్యను తలదన్నే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే అందించడం ఏపీలోనే కనిపిస్తున్నది. ఇది ప్రభుత్వ విద్యా విధానానికీ గౌరవం కల్పించడంతోపాటూ బహుజన వర్గాలకు పట్టాభిషేకం చేయడం లాంటిదే. సామాజిక న్యాయం తద్వారా సామాజిక మార్పుకు దోహదం చేసే అందరికీ ఉచిత కార్పొరేట్ విద్య, ఉచితౖ వెద్యం, పాలనా రంగంలో బహుజన వర్గాలకు సముచిత స్థానం ఇవ్వడం లాంటివన్నీ ఈ ఐదేళ్ళ పాలనలో సాగాయన్నది జగమెరిగిన సత్యం. అందుకే ఎన్నికల ప్రచారానికి జగన్ ఎక్కడికి వెళ్ళినా అసంఖ్యాక జనం! మండుటెండ ల్లోనూ రోడ్లపై నిలబడి ఎదురుచూస్తూ నీరాజనాలు!!బసవేశ్వరుడు, నారాయణగురు, రవిదాస్ చమార్, పెరియార్ రామ స్వామి, ఫూలే, అంబేడ్కర్ లాంటి తత్త్వవేత్తలను చూశాము. జాషువా లాంటి సాంఘిక విప్లవ కవులను చూశాము. సాహు మహరాజ్ లాంటి సామాజిక విప్లవ పాలకులను చూశాము. నెహ్రూ లాంటి సెక్యులర్, సెమీ సోషలిస్ట్ నాయకులను చూశాము. జగన్ ఐదేళ్ల పాలన వీళ్లందరి సమాహారంగా కనిపిస్తోంది. అందుకే ఏపీలో సామాజిక మార్పుల దిశగా బలమైన పునాదులు పడి గుణాత్మక మార్పులు వస్తున్నాయి. అయితే టీడీపీ–జనసేన–బీజేపీల కూటమికి జగన్ పాలన నచ్చడంలేదు. ఆయనపై అసత్య ప్రచారంతో దాడి చేస్తోంది. తమ అసంబద్ధ మేనిఫెస్టోతో ప్రజ లను మభ్యపెడుతోంది. జగన్ మాత్రం ఐదేళ్ళలో తాను చేసిన పనులను నమ్ముకొనే ప్రజాస్వామిక పద్ధతిలో ప్రచార రథాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజలు జగన్ మరోసారి గెలిస్తే ఆంధ్రప్రదేశ్ సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని నమ్మి జగనన్ననే అఖండ మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్కు లభిస్తున్న జనాదరణను సహించలేక ఆయన్ని భౌతికంగా తొలగించాలనుకునే రాజకీయ దివాలాకోరుతనాన్ని ప్రతిపక్షాలు ప్రదర్శించడం శోచనీయం. ఎవరెన్ని దాడులు చేసినా, రాజనీతిని రాజభీతిగా మార్చినా జగన్ విజయాన్ని ఆపలేవు. ఎందుకంటే జగన్ ‘సెక్యులరిజం, సోషలిజం’ భావాలను హృదయానికి హత్తుకొని అన్ని వర్గాల, అన్ని వర్ణాల ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత కోసం ప్రజాస్వామిక పాలనను అందిస్తున్న సాంఘిక విప్లవ నాయకుడు!!డా‘‘ కాలువ మల్లయ్య వ్యాసకర్త ప్రముఖ కథారచయిత ‘ 91829 18567 -
ఆనందం ఆవిరై.. ఆందోళన ఆవిష్కృతమై..!
విజయం మాదేనంటూ నిన్నామొన్నటి వరకు బీరాలు పలికిన వేమిరెడ్డి దంపతులు.. ఇప్పుడు గౌరవ స్థాయిలో ఓట్లు దక్కితే చాలు భగవంతుడాననే స్థితికి వచ్చారు. డబ్బులను వెదజల్లితే ఏదైనా చేసేయొచ్చనే భ్రమలో ఉన్న వీరికి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు ఇప్పుడిప్పుడే బోధపడుతున్నాయి. తమ ప్రచారాలు.. చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం సభలు వెలవెలబోవడం.. నగదు ప్రలోభాలకు గురై సైకిలెక్కిన నేతలు ఒక్కొక్కరూ తిరిగి సొంతగూటికి చేరుకుంటుండటంతో ఏమి చేయాలో పాలుపోక దిక్కుతోచక స్థితిలో వీరు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రచారాలను సైతం వీరు తగ్గించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎన్నికలకు పట్టుమని 12 రోజుల్లేవు. ఈ స్థితిలో ప్రచారాలతో పార్టీలు క్షేత్రస్థాయిలో తమ బలాన్ని చాటుతుంటాయి. అయితే నెల్లూరులో ప్రతిపక్ష టీడీపీ పరిస్థితి దయనీయంగా మారింది. ధనబలంతో ఏదైనా చేయొచ్చనే ధీమాతో ఇప్పటి వరకు ఉన్న వేమిరెడ్డి శిబిరంలో టెన్షన్ మొదలైంది.బూమరాంగ్.. నిజానికి వేమిరెడ్డి దంపతులకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎలాంటి అనుభవం లేదు. ఈ తరుణంలో వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డికి నెల్లూరు లోక్సభ, ప్రశాంతిరెడ్డికి కోవూరు అసెంబ్లీ టికెట్లను టీడీపీ కేటాయించింది. ఈ క్రమంలో తమ బలాన్ని ప్రదర్శించాలనే భావనతో నగదు ప్రలోభాలకు గురిచేసి పలువురు నేతలను వీరు ఆకర్షించారు. అయితే టీడీపీలో చేరిన నేతల్లో చాలా మంది అక్కడ ఇమడలేక తిరిగి తమ సొంతగూటికి చేరుకుంటుండటంతో వీరి వ్యూహాలు బూమరాంగయ్యాయి. మరోవైపు సీఎం జగన్మోహన్రెడ్డి కట్టబెట్టిన పదవులను అనుభవిస్తూ.. వీరు పార్టీని మారి తప్పటడుగేశారని ఆయన వర్గీయులే బహిరంగంగా చెప్తుండటం గమనార్హం.ఏదీ ప్రజాస్పందన..? ప్రశాంతిరెడ్డి పోటీ చేస్తున్న కోవూరుతో సహా ఏ నియోజకవర్గంలోనూ ఆశించిన స్థాయిలో ప్రజాదరణ టీడీపీకి కనిపించడంలేదు. డబ్బులిచ్చి జనాలను తరలిస్తున్నా, కొద్దిసేపటికే ముఖం చాటేస్తున్నారు. కోవూరులో నిర్వహించిన ఆతీ్మయ సమావేశాల్లో ప్రజాస్పందన కానరాకపోగా, గ్రూపుల మధ్య కీచులాటలు వీరికి వెల్కమ్ పలుకుతున్నాయి. మరోవైపు కావలి, ఉదయగిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన ప్రజాగళం సభలకు జనం రాకపోవడంతో తమ రాజకీయ భవిష్యత్తుపై వీరికి ఎటూ పాలుపోవడంలేదు. స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులను కొన్నంత సులభంగా ఓట్లు బదిలీ అవుతాయనే వీరి భ్రమ సైతం తొలగిపోయింది.నిన్ను నమ్మం బాబూ..! టీడీపీ నిర్వహిస్తున్న ప్రజాగళం సభలకు జనాలు పలుచగా హాజరవుతున్నారు. ఆచరణ సాధ్యం కాని మేనిఫెస్టోను ప్రకటించడంతో చంద్రబాబుపై నమ్మకం మరింత సన్నగిల్లింది. ఈ తరుణంలో వరుస సెగతో ఆ పార్టీ అభ్యర్థులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఓటేయాలని అడిగే నాథుడేడీ..? వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డికి ఓటేయాలని అడిగే నాథుడే కరువవుతున్నారు. తనకు ఓటేయమని ప్రజలను కోరాలని వేమిరెడ్డి సూచిస్తే.. ఖర్చులకు డబ్బులివ్వందే ప్రచారం చేయలేమని అభ్యర్థులు చెప్పారని సమాచారం. మరోవైపు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఓటును తమకే వేయాలని.. లోక్సభకు సంబంధించి మీ ఇష్టమంటూ నారాయణ టీమ్ ప్రచారం చేస్తోంది. కావలి, ఉదయగిరి, ఆత్మకూరు అభ్యర్థుల ప్రచారంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నామినేషన్లకు ముందే స్పష్టత వాస్తవానికి క్షేత్రస్థాయిలో టీడీపీకి ప్రజాదరణ లేకపోయినా.. డబ్బు మూటలతో ఓట్లు కొల్లగొట్టొచ్చనే ధీమాతో వేమిరెడ్డి దంపతులు ఉన్నారు. అయితే నామినేషన్లకు ముందే వీరికి తమ భవిష్యత్తుపై ఓ స్పష్టత వచ్చింది. మరోవైపు వేమిరెడ్డి ఆర్థిక బలంతో నెల్లూరు లోక్సభ పరిధిలోని టీడీపీ అభ్యర్థులు తాము గెలిచేస్తామని కలలుగన్నారు. అయితే క్షేత్రస్థాయి పరిస్థితులపై వీరికి ఇప్పుడిప్పుడే ఓ క్లారిటీ వస్తోంది. మరోవైపు నగదు ప్రలోభాలతో టీడీపీ మాజీలను వీరు తమవైపు తిప్పుకొన్నా.. ఆ ఆనందం మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలింది. గ్రూపులతో తలనొప్పికోవూరుపై ఇప్పటివరకు దృష్టి సారించిన వేమిరెడ్డి తాజాగా ఆ ఫోకస్ను తగ్గించారని తెలుస్తోంది. టీడీపీకి క్షేత్రస్థాయిలో బలం లేకపోవడం.. ప్యాకేజీలు ఇచ్చి తెచ్చుకున్న నేతలతో ఒరిగేదేమీ లేదని గ్రహించారు. నాలుగు గ్రూపులు వేమిరెడ్డి దంపతులకు తలనొప్పిగా పరిణమించాయి. నిన్నామొన్నటి వరకు భారీగా ఖర్చు పెట్టిన వీరు ఇప్పుడు తగ్గించేశారనే టాక్ వినిపిస్తోంది. సైలెంట్గా పక్కకు తోసేశారు కోవూరు నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలకు వ్యూహకర్త పోలంరెడ్డి దినేష్ రెడ్డేననే ఉద్దేశంతో ఆయన్ను సైలెంట్గా సైడ్ చేశారని సమాచారం. ఎన్నికల ఖర్చుల వ్యవహారాలను చూసేందుకు తమ సొంత టీమ్ను రంగంలోకి దింపారని తెలుస్తోంది. వేమిరెడ్డి నామినేషన్ సమయంలోనూ దినేష్ ఒకింత అసంతృప్తిగా కనిపించారని ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు. తొందరపడి నిర్ణయం తీసుకున్నాం.. తిరిగి వెనక్కి వెళ్లలేం.. ఎన్నికల తర్వాత మా వ్యాపారాలు మాకున్నాయంటూ ముఖ్య నేతల వద్ద వేమిరెడ్డి దంపతులు వాపోయారని సమాచారం. -
జయరాం.. రాం!
గుంతకల్లులోని 18వ వార్డులో బుధవారం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎదుటే టీడీపీలోని తలారి మస్తానప్ప వర్గం, మధు, శివల వర్గం మాటల యుద్ధానికి దిగారు. గుమ్మనూరు నచ్చజెప్పినా వినలేదు. దీంతో విసిగిపోయిన జయరాం.. ‘‘మీకు చేతులు జోడించి మొక్కి చెబుతున్నా.. పార్టీని భ్రష్టు పట్టించకండి..’’ అని నిట్టూరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదొక్కటే కాదు.. ఇప్పటివరకూ గుమ్మనూరు ప్రచారం నిర్వహించిన ప్రతి చోటా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకుని, ఏదేదో అనుకుని గుంతకల్లు బరిలో దిగితే ఇంకేదో జరుగుతుండడంతో ‘గుమ్మనూరు’ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గుంతకల్లు: ‘అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే... జేబులు ఖాళీ ఆయెనే’’ అదేదో సినిమాలోని ఈ పాట టీడీపీ గుంతకల్లు అభ్యర్థి గుమ్మనూరు జయరామ్కు సరిగ్గా సరిపోతోంది. డబ్బుతో ఎన్నికలు గట్టెక్కవచ్చు అనుకున్న ఆయన అంచనాలు తలకిందులవుతున్నాయి. తెలుగు తమ్ముళ్ల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు జయరామ్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అసలే ఆరాచకవాదిగా ముద్ర పడిన జయరామ్ పట్ల ఇప్పటికే గుంతకల్లు ప్రజల్లో సదభిప్రాయం లేదు. ఈ క్రమంలోనే సొంత పార్టీ కేడర్ కూడా కలిసి రాకపోవడంతో ఆయన ఏటికి ఎదురీదుతున్నారు.పుండుపై కారం.. 👉 గుంతకల్లు నియోజకవర్గంలో చాలా చోట్ల టీడీపీ నాయకుల మధ్య కోల్డ్వార్ నడుస్తున్నా ఇప్పటి వరకూ బయటపడలేదు. అయితే, ప్రచారం నిమిత్తం గుమ్మనూరు ఆయా ప్రాంతాల్లో పర్యటించిన సమయాల్లో తెలుగు తమ్ముళ్లు ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శిస్తూ రచ్చకెక్కుతున్నారు. 👉 టీడీపీ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ భర్త, ప్రస్తుతం గుంతకల్లు పదో వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ ఐదేళ్లుగా పారీ్టకి దూరంగా ఉన్నాడు.👉 దీంతో ఆ వార్డు బాధ్యతలను రాయల్ వెంకటే‹Ùకు పార్టీ అధిష్టానం అప్పగించింది. ఇటీవల వెంకటేష్ ఆహా్వనం మేరకు గుమ్మనూరు జయరాం 10వ వార్డుకు రాగా, దీన్ని జీరి్ణంచుకోలేని చంద్రశేఖర్.. గుమ్మనూరు ఎదుటే వెంకటేష్తో గొడవకు దిగారు. ఈ క్రమంలోనే చంద్రశేఖర్ వర్గానికి చెందిన పలువురు వెంకటే‹Ùపై దాడికి దిగారు. తమ కులానికి చెందిన వ్యక్తిపై దాడి జరగడంతో బలిజ సంఘం నాయకులు ఓర్చుకోలేకపోతున్నారు. చంద్రశేఖర్తో బేషరుతుగా క్షమాపణలు చెప్పించాలంటూ ఇప్పటికే గుమ్మనూరు సోదరుల వద్దకు పంచాయితీకి వెళ్లినా ఏ మాత్రం స్పందన లేకపోవడంతో గుమ్మనూరు తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. 👉 10 రోజుల కిత్రం జితేంద్రగౌడ్ ఆధ్వర్యంలో ఏబీ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన అత్మీయ సమావేశానికి గుమ్మనూరు జయరాం హాజరయ్యారు. ఈ సమావేశంలో తమకు ప్రాధాన్యత ఇవ్వలేదని కొందరు బహిరంగంగా విమర్శించారు. మాజీ కౌన్సిలర్లు ఆమ్లేట్ మస్తాన్యాదవ్, కేశప్ప మధ్య వాగ్వాదం చేటు చేసుకొని, బూతులు తిట్టుకున్నారు. 👉 కథలగేరిలోని మాజీ కౌన్సిలర్ ఆమ్లేట్ మస్తాన్యాదవ్, మరో మాజీ కౌన్సిలర్ కథల మారెప్ప, కుమారుడు మహేష్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం గుమ్మనూరు నిర్వహించిన ప్రచారంలో తారస్థాయికి చేరాయి. మస్తాన్యాదవ్ను వార్డులో తిరగనీయనంటూ గుమ్మనూరు ఎదుటే మహేష్ హెచ్చరికలు జారీ చేశాడు. జనసేన, బీజేపీ నాయకులూ గరంగరం..👉కూటమిలో భాగస్వామ్య పారీ్టలైన జనసేన, బీజేపీల నుంచి కూడా గుమ్మనూరుకు వ్యతిరేకతే ఎదురవుతోంది. ఇటీవల జనసేన నాయకుడు పూలరమణ తన నివాసంలో ఆతీ్మయ సమావేశం ఏర్పాటు చేయగా, జయరాంతోపాటు టీడీపీ డాక్టర్స్ సెల్ జిల్లా అధ్యక్షురాలు పత్తి హిమబిందు హాజరయ్యారు. ఈ సందర్భంగా హిమబిందు మాట్లాడుతూ జన సైనికులు ఆవేశం తగ్గించుకుని మాట్లాడాలని అనడంతో ఒక్కసారిగా ఆ పార్టీ కార్యకర్తలు భగ్గుమన్నారు. ఇంకోసారి ఇలా మాట్లాడితే ఊరుకునేది లేదని గుమ్మనూరు ఎదుటే హిమబిందును హెచ్చరించారు.👉 బీజేపీలో నాయకుల మధ్య వర్గ పోరు కూడా గుమ్మనూరుకు మైనస్లా మారింది. బీజేపీ నాయకులు మంజుల వెంకటే‹Ù, కొలిమి రామాంజనేయులు మధ్య చాలా కాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇలా.. గుంతకల్లు నియోజకవర్గంలోని ప్రతి వార్డులో, గ్రామాల్లో వ్యతిరేకతకు తోడు బీజేపీ, జనసేనల నుంచి కూడా చిక్కుముళ్లు ఎదురవుతుడడంతో గుమ్మనూరు జయరామ్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు తెలుస్తోంది. -
చంద్రబాబు పగ.. ఫస్టొచ్చింది.. పెన్షన్ రాలేదు
ప్రతినెలా ఫస్ట్ తేదీ రాగానే పలకరిస్తూ చేతిలో కరెన్సీ నోట్లు పట్టుకుని పెద్దమ్మా బాగున్నావా.. తాతా బాగున్నావా అని పలకరించే వాలంటీర్ రాలేదు... అయన వచ్చి డబ్బులిస్తే మందులు... పప్పు ఉప్పు...సరుకులు కొనుక్కుందాం అనుకున్నాను.. వాలంటీర్ రాలేదు... చేతిలోకి పైసలు పడలేదు... ఈ ఎండల్లో ఆటోల్లో పక్కూరు వెళ్లి బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకోవాలట. ఈ మండుటెండలో ఎలా వెళ్లాలో ఏమో అంటూ వృద్ధులు.. వికలాంగులు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు వేసిన ఎత్తులు, కుట్రల వల్ల వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు.అసలు బ్యాంకులకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవడం మనకు అవుతుందా ? ఆ బ్యాంకుల్లో క్యూలైన్లు.. నిలబడడం.. ఆ ఫారాలు నింపడం.. ఇదంతా పెద్ద సమస్య.. దానికితోడు కొన్ని బ్యాంకులు తమ ఖాతాల్లో కనీస నిల్వ (మినిమమ్ బ్యాలెన్స్ )లేకపోతె కొంత పెనాల్టీ విధిస్తాయి. కొన్నాళ్లపాటు ఆ ఖాతా యాక్టివ్గా లేకపోతే ఆ ఖాతాలను బ్యాంకులు మూసేస్తాయి. ఈ పేదల ఖాతాల్లో నిత్యం మినిమమ్ బ్యాలెన్స్ ఉంటుందా అనేది సందేహమే... అలా వాళ్ళు బ్యాలెన్స్ ఉంచకపోతే పాపం వీళ్ళ ఖాతాల్లోకి వచ్చిన మూడు వేలలో కొంత కోత విధిస్తే అది తమకు నష్టం అని వారు ఆందోళన చెందుతున్నారు. ఇదంతా చంద్రబాబు చేసిన కుట్ర అని, వాలంటీర్లు ఇల్లిల్లూ తిరిగి పెన్షన్లు పంచడాన్ని అయన భరించలేక ... సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంచిపేరు రావడాన్ని సహించలేక ఇలాంటి కుట్రలకు దిగారని, రేపు ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని అంటున్నారు..మగ నంగనాచి చంద్రబాబు..ఊళ్లలో కొంతమంది నంగనాచి లేడీస్ ఉంటారు.. వాళ్ళో గదిలో మొగుణ్ణి చావచితక్కొట్టి మళ్ళీ వీధుల్లోకి వచ్చి.. అయ్యో నా మొగుడు నన్ను చంపేసినాడమ్మో... నా మొగుడు.. కొట్టీసినాడమ్మో అంటూ వీధిలోకి వచ్చి వీరంగం వేస్తారు... ఇప్పుడు చంద్రబాబు సైతం మగ నంగనాచి పాత్రలో జీవిస్తున్నారు... మార్చి వరకూ ప్రతి ఇంటికీ వెళ్లి పెన్షన్షన్లు అందించే వాలంటీర్లను కోర్టు ద్వారా అడ్డుకున్న చంద్రబాబు ఇప్పుడు అయ్యో వృద్ధులు అంటూ కన్నీళ్లు కారుస్తున్నారు.వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్లు ఇస్తే అది సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే అంశం అవుతుంది కాబట్టి.. ఆ డోర్ డెలివరీకి ఆపాలంటూ కోర్టులు, ఎన్నికల కమిషన్ ద్వారా అడ్డుకున్న చంద్రబాబుకు వెనువెంటనే విషయం అర్థమైంది. ఏప్రిల్లో ఇలాగే ఎండల్లో లబ్ధిదారులు బ్యాంకులు.. సచివాలయాలు వద్దకు వెళ్లి పెన్షన్లను తీసుకుంటూ... చంద్రబాబును తిట్టడం మొదలు పెట్టారు.. దీంతో ఇదేదో తనకు వ్యతిరేకత అయ్యేలా ఉందని గుర్తించిన చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ఇదంతా జగన్ కుట్ర అని, పెన్షన్లు ఎగ్గొట్టేందుకే ఇవన్నీ చేస్తున్నారని ఎదురు విమర్శిస్తున్నారు. వాస్తవానికి ఈ మేలో కూడా మరింత మండుతున్న ఎండల్లో వృద్ధులు మళ్ళీ బ్యాంకులవద్ద పడిగాపులు కాయడం.. దీనికి చంద్రబాబే కారణం అని వాళ్ళు గుర్తించి ఆయన్ను తిడుతుండడంతో ఏమి చేయాలో తెలియక చంద్రబాబు కొత్త నాటకాలకు తెరతీస్తున్నారు..-సిమ్మాదిరప్పన్న
Related News by category
-
ESI scam: అవినీతి మరక.. అచ్చెన్నకు ఎరుక
కార్మిక శాఖ మంత్రి అంటే కార్మికులకు న్యాయం చేయాలి. కానీ అచ్చెన్నాయుడు రూటే సెప‘రేటు’. శ్రామిక సోదరుల కోసం కొనాల్సిన మందుల్లోనూ దందా నడిపారు. వైద్యపరికరాలు ఎక్కువ ధరకు కోట్ చేసి, బినామీలను తెర మీదకు తెచ్చి, మందు బిల్లుల్లో మాయలు చేసి రూ.150 కోట్ల అక్రమానికి పాల్పడి అవినీతి మంత్రిగా ముద్ర పడ్డారు. ఈఎస్ఐ స్కామ్లో అరెస్టయ్యి జిల్లా పరువు తీసేశారు. మంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో దొరికిందే చాన్స్ అంటూ దోచుకున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఈఎస్ఐ స్కామ్.. అచ్చెన్నాయుడు ఎన్నటికీ చెరపలేని అవినీతి మరక. మన జిల్లాకు చెందిన నాయకుడు రాష్ట్ర స్థాయిలో భారీ అవినీతికి పాల్పడిన వ్యవహారం మాయని మచ్చగా మిగిలిపోయింది. అధికారులను బెదిరించడం, అవసరమైతే బదిలీ చేయడం, తనకు కావల్సిన వారిని తెప్పించుకుని అక్రమాలకు పాల్పడటం టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం సాగిపోయింది. అంతటితో ఆయన లీలలు ఆగలేదు. కార్మికుల కోసం కొనుగోలు చేసిన మందుల్లోనూ అవినీతికి పాల్పడ్డారు. దాదాపు రూ.150కోట్లకు పైగా జరిగిన స్కామ్లో సూత్రధారిగా నిలిచారు. కారి్మకుల సొమ్ము కాజేసిన అచ్చెన్న బండారం విజిలెన్స్ అధికారుల విచారణలో బయటపడింది. వైద్య పరికరాలు, మందుల కొనుగోళ్ల పనులు నామినేషన్పై అప్పగించాలని మంత్రి హోదాలో కింజరాపు అచ్చెన్నాయుడు ఇచ్చిన సిఫారుసు లేఖతో మొత్తం గుట్టు రట్టయ్యింది. వైద్య పరికరాలు, ఔషధాలను బేరమాడి తక్కువకు కొనాల్సింది పోయి సగటున 132శాతం అధికంగా చెల్లించి కోట్లు కొట్టేశారు. అచ్చెన్న అవినీతి మార్క్ కారి్మక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో అచ్చెన్న తన మార్క్ అవినీతిని చూపించారు. ఈఎస్ఐ ఆస్పత్రులకు అవసరమైన మందులు, వైద్య పరికరాల కొనుగోలు కాంట్రాక్ట్ను తాను చెప్పిన సంస్థకు నామినేటేడ్ కట్టబెట్టాలని సంబంధిత అధికారులకు లిఖిత పూర్వగా ఆర్డర్ జారీ చేశారు. సిఫార్సుకు ముందు వారితో ఏ లాలూచీలు పడ్డారో తెలీదు గానీ తన లెటర్ హెడ్ ద్వారా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో తూచా తప్పకుండా అధికారులు పాటించారు. నామినేటేడ్లో కాంట్రాక్ట్ దక్కించుకున్న ఆ సంస్థ ప్రతినిధులు తర్వాత అనేక అక్రమాలకు పాల్పడ్డారు. నకిలీ ఇండెంట్లతో పెద్ద ఎత్తున నిధులు స్వాహా చేశారు. పక్కా ఆధారాలతో ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడును అరెస్టు కూడా చేశారు. అవినీతి జరిగిందిలా... 👉రూ. 293.51కోట్ల విలువైన మందులకు కొనుగోలు కేటాయింపులు చేయగా పరిమితికి మించి రేట్ కాంట్రాక్ట్ లేని సంస్థల నుంచి ఏకంగా రూ.698.36కోట్లు విలువైన ఔషధాలు కొనుగోలు చేశారు. 👉శస్త్ర చికిత్స పరికరాలకు టెండర్లు లేకుండా రూ.6.62కోట్లు మేర చెల్లించారు. వాస్తవ ధర కంటే ఇది 70శాతం అధికం. 👉ఫ్యాబ్రికేటేడ్ కొటేషన్స్ సృష్టించి రేటు కాంట్రాక్టులో లేని సంస్థలకు ఆర్డర్లు ఇచ్చారు. రాశి ఫార్మా, వీరేష్ ఫార్మా సంస్థలకు కొనుగోలు ఆర్డర్ల కంటే అదనంగా రూ. 15.93కోట్లు చెల్లించారు. ఇందులో రూ.5.70కోట్లు మేర అదనంగా చెల్లించినట్టు తేలింది. 👉 కోట్లు వెచ్చించి కొన్న వందల పరికరాలను వినియోగించకుండా మూలనపడేశారు. జెర్సన్ ఎంటర్ ప్రైజెస్ అనే బినామీ సంస్థకు ఈఎస్ఐ డైరెక్టర్ డాక్టర్ సీకే రమే‹Ùకుమార్ రూ. 9.50కోట్లు చెల్లించారు. 👉 ఒక్కో బయోమెట్రిక్ పరికరం ధర రూ.16,992 అయితే రూ.70,760చొప్పున నకిలీ ఇండెంట్లు సృష్టించి కొనుగోలు చేశారు. 👉 ఈ క్రమంలో రశీదులు ఫోర్జరీ చేసి కోట్లు కొల్లగొట్టారు. నకిలీ కొటేషన్లు సృష్టించి రేటు కాంట్రాక్ట్లో లేని సంస్థలకు ఆర్డర్లు ఇచ్చారు. ల్యాబ్ కిట్లు, ఫరీ్నచర్, ఈసీజీ సరీ్వసులు, బయోమెట్రిక్ పరికరాల కొనుగోలులో భారీగా అక్రమాలు జరిగాయి. 👉 లేని సంస్థల నుంచి మందులు కొనుగోలు చేసినట్టు నకిలీ ఇండెంట్లు సృష్టించారు. ప్రభుత్వం రూ.89కోట్లు చెల్లిస్తే అందులో రేట్ కాంట్రాక్ట్లో ఉన్న సంస్థలకు రూ. 38కోట్లు చెల్లించారు. మిగతా రూ.51కోట్లను దారి మళ్లించారు. 👉టెండర్లు లేకుండా నామినేషన్ కింద ఆర్డర్లు ఇవ్వడంతో కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము దురి్వనియోగమైంది. అవుట్ సోర్సింగ్ దందా సాధారణంగా ఔట్ సోర్సింగ్ పోస్టులకు అవసరమైన అభ్యర్థులను సమకూర్చే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీని కలెక్టర్ నియమించాలి. జిల్లా స్థాయిలో నోటిఫికేషన్ ఇచ్చి, అర్హత గల ఏజెన్సీలు దరఖాస్తు చేస్తే, వాటిలో సరైనదేదో నిర్ధారణ చేసుకుని ఎంపిక చేస్తారు. కానీ గత ప్రభుత్వంలో టీడీపీ నేతలను ఏజెన్సీలుగా నియమించి దందా చేశారు. కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి స్థాయిలోనే ఏ శాఖకు, ఏ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ఉండాలి, ఆ ఏజెన్సీ ఎవరి చేతిలో ఉండాలన్నది ఫిక్స్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతటితో ఆగలేదు. బినామీ ఏజెన్సీల ముసుగులో స్థానిక నేతలు చెలరేగి పోయి ఔట్ సోర్సింగ్ పోస్టులకు బేరసారాలు సాగించారు. ఒక్కో పోస్టును రూ. 2లక్షల నుంచి రూ. 3లక్షల వరకు అమ్ముకున్న దాఖలాలు ఉన్నాయి. అచ్చెన్నపై నమోదు చేసిన కేసులివే.. 👉అవినీతి నిరోధక శాఖలో పలు సెక్షన్ల కింద అచ్చెన్నాయుడిపై కేసులు నమోదు చేశారు. క్రైమ్ నంబర్ 04/ఆర్సీఓ– సీఐయూ– ఏసీబీ/2020 యు/ఎస్ 13(1), (సీ), (డీ), ఆర్/డబ్ల్యూ 13(2) ఏసీబీ పీసీ సవరణల చట్టం–2018, ఏసీబీలోని ఐపీసీ సెక్షన్ల ప్రకారం సెక్షన్ 408, సెక్షన్ 420, 120–బీ కింద అచ్చెన్నాయుడిపై అధికారులు కేసు నమోదు చేశారు. 👉రూ. 975.79కోట్ల విలువైన మందులతో పాటు వైద్య పరికరాల కొనుగోలులో సుమారుగా రూ.150కోట్ల పైన అవినీతి అక్రమాలు జరిగినట్టు ఏసీబీ తేలి్చంది. 👉ఆస్పత్రులకు అవసరమైన మందులు, ఔషధాలు, వైద్య ఉపకరణాలు, ఆపరేషన్లకు అవసరమైన పరికరాలు, ల్యాబ్ కిట్స్, ఫరీ్నచర్ పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. రూ. 975.79కోట్ల రూపాయల మేర కొనుగోలు జరిగాయి. అయితే ఈ ప్రక్రియలో యథేచ్ఛగా నియమాలు, మార్గదర్శకాలను ఉల్లంఘించారు. 👉నిబంధనల ప్రకారం ఉండాల్సిన డ్రగ్ ప్రొక్యూర్మెంట్ కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. కొనుగోళ్ల ప్రక్రియలో ఎక్కడా ఓపెన్ టెండర్లు కూడా పిలవలేదు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడింది. మొదటి నుంచీ అదే బాగోతం రాష్ట్ర స్థాయిలోనే కాదు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. గ్రానైట్, ఇసుక కుంభకోణాలు, బీసీ కార్పొరేషన్ రుణాల్లో అక్రమాలు, సింగిల్ టెండర్ విధానంతో సొంత అన్నకు టెండర్లు కట్టబెట్టడం, ధాన్యం రవాణాకు వచ్చిన కోట్లాది రూపాయలు సొంత ఖాతాలకు మళ్లించుకోవడం, మినుముల కుంభకోణంతో కోట్ల రూపాయలు సొంత ఖాతాలకు మళ్లించుకోవడం, టెక్కలిలో సింగిల్ టెండర్ విధానంతో తన బినామీ లాడి శ్రీనివాసరావుకు ఆర్టీసీ టెండర్లు కట్టబెట్టడం, దివాకర్ ట్రావెల్స్కు అడ్డగోలుగా రవాణా లైసెన్సులు జారీ చేయడం వంటి ఆరోపణలను అచ్చెన్న మూటగట్టుకున్నారు. -
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై విపక్షాల రాద్ధాంతం అర్థరహితం
శ్రీకాకుళం (పీఎన్కాలనీ):ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై విపక్షాల రాద్ధాంతం అర్థరహితమని, ప్రస్తుతానికి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలు కాలేదని, దీనిపై ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలు కాలేదని, దేశవ్యాప్తంగా ఈ చట్టంపై ఒక అభిప్రాయానికొస్తే దీనిపై ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుందన్నారు. ఈ స్టాంపింగ్ విధానం టీడీపీ హయాంలో 2016లోనే పైలెట్ ప్రాజెక్టుగా మొదలైందన్నారు. ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని పేర్కొన్నారు. కరణాలు, మునసబులతో నడుస్తున్న వ్యవస్థను 1984లో రద్దు చేశారని, 1985ృ86లో విలేజ్ అసిస్టెంట్లను రిక్రూట్ చేసుకోవడంతో రెవెన్యూ వ్యవస్థలోకి వచ్చారని తెలిపారు. 1988 89లో కొంతమంది విలేజ్ అసిస్టెంట్లను నియమించారని, కరణాలు, మునసబుల్లో కొందరు 1992లో మళ్లీ విధుల్లోకి చేరారని, ఈ రకంగా అనేక మార్పులు చేయడం వల్ల రెవెన్యూ వ్యవస్థలో రికార్డుల అప్డేషన్ సక్రమంగా జరగలేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం 2002లో వీఆర్వో వ్యవస్థను రద్దుచేసి వీరందరినీ పంచాయతీరాజ్ వ్యవస్థలో కలిపేశారని తెలిపారు. ఆ సమయంలో రెవెన్యూ రికార్డుల నిర్వహణ బాధ్యతలను అనుభవం లేని పంచాయతీ సెక్రటరీలకు కూడా అప్పజెప్పడంతో చాలా తప్పిదాలు జరిగాయన్నారు. ప్రస్తుతం ప్రెసెంపటివ్ ల్యాండ్ టైట్లింగ్ సిస్టమ్ వల్ల సబ్డివిజన్ పనులు, వంశపారంపర్యంగా వచ్చే మార్పులు, లావాదేవీలు, రెవెన్యూ రికార్డుల్లో మార్పు చేయాలంటే దరఖాస్తుదారు పలు కార్యాలయాలు చుట్టూ తిరిగే పరిస్థితి ఉందన్నారు. రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 1971 (ఆర్ఓఆర్) అమలుపరిచిన ఈ చట్టం పూర్తిగా విజయవంతం కాలేదదన్నారు. భూముల నిర్వహణ, మార్పులు, కొనుగోలు అమ్మకాలు, అలాగే భూ రికార్డుల నిర్వహణ, వివాదాల పరిష్కారానికి ఒక సంపూర్ణ చట్టం అంటూ లేదన్నారు. వీటన్నింటి కోసం అనేక చట్టాల మీద ఆధారపడాల్సి వస్తోందన్నారు. చట్టాల్లో కొన్ని కేంద్రప్రభుత్వం, మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేసినవి ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలకు సవరణలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తోందని తెలిపారు. 2003లో బయటపడిన తెల్గీ స్టాంప్ పేపర్స్ స్కామ్ భారత ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలను కుదిపేసిందని పేర్కొన్నారు. ఈ స్కామ్తో స్టాంప్ పేపర్ల నిర్వహణలో ఉన్న లోపాలు బట్టబయలయ్యాయని పేర్కొన్నారు. దీంతో ఈృస్టాంపింగ్ ప్రక్రియను అందుబాటులోకి తేవాలని కూడా ప్రభుత్వాలు ఆలోచించడం జరిగిందన్నారు. టీడీపీ హయాంలోనే 2016లో ఈృస్టాపింగ్ పైలెట్ ప్రాజెక్టు కింద మొదలు పెట్టారన్నారు. 2007లో ప్రపంచ బ్యాంకు అధ్యయన ప్రకారం మన దేశంలో సివిల్ కోర్టులందు ఉన్న కేసుల్లో 66% సివిల్ కేసులు భూతగాదాలకు సంబంధించినవేన్నారు. దేశంలో భూములకు సంబంధించి రికార్డులు సరిగా నిర్వహించలేకపోవడం వల్ల, భూ యాజమాన్యానికి సంబంధించిన వివాదాలు అధికంగా ఉండడంతో భూమిపై ఆధారపడి జీవించేవారి జీవన విధానం సరిగ్గా జరగడం లేదని భారత ప్రభుత్వము/నీతి ఆయోగ్ గ్రహించి, దీనిపై అనేక సమావేశాలు నిర్వహించి నీతి ఆయోగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ సంయుక్తంగా ఒక మోడల్ చట్టం, నిబంధనలతో తయారు చేసి డిసెంబర్ 2019 లో రాష్ట్రాలన్నింటికీ పంపించారన్నారు. దీని ఫలితంగా ఈ సమస్యలకు పరిష్కారంగా ఒక ప్రత్యేక చట్టం అవసరమైందన్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఇంటి స్థలాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ సంస్థలకు చెందిన భూములతో సహా, సమగ్ర సమాచార సేకరణ నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు వివాదాలు లేని భూ యాజమాన్య హక్కులు నిర్ధారించుటకు ఈ చట్టం అవసరమైందన్నారు. భూయాజమాన్య హక్కులు ధ్రువీకరించే సమాచారం మొత్తం, ఆధునిక టెక్నాలజీ (బ్లాక్చైన్ టెక్నాలజీ) సాయంతో ఇతరులు రికార్డులను తారుమారు చేసేందుకు అవకాశం లేని విధంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ చట్టం ద్వారా రైతులకు, భూ యజమానులకు, భూభాగాలకు సంబంధించి పూర్తి హక్కులు కల్పిస్తున్నట్లు తెలిపారు. భూ యాజమాన్య హక్కులకు సంబంధించి జరిగే మార్పులు చేర్పులు ఎప్పటికప్పుడు నమోదు చేయడమే కాకుండా హక్కుదారు భూ హక్కులను రక్షిస్తూ వివాదాలు లేని భూ పరిపాలన అందించడమే ఈ చట్టం ఉద్దేశమన్నారు. ఇదే సమయంలో భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో రెవెన్యూ రికార్డుల, భూహక్కుల పరిరక్షణ అంశంపై రాష్ట్రాలు ప్రత్యేక చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని భావించిందన్నారు. అన్ని స్తిరాస్థిలు వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఇంటి స్థలాలు, అపార్ట్మెంట్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, వివిధ సంస్థలకు చెందిన భూముల సహా సమగ్ర సమాచార సేకరణ, నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు, వివాదాలు లేని భూయాజమాన్య హక్కులు నిర్ధారించుట జరుగుతోందన్నారు. భూయాజమాన్య హక్కులు ధ్రువీకరించు సమాచారం మొత్తం, ఆధునిక టెక్నాలజీ (బ్లాక్చైన్ టెక్నాలజీ) సాయంతో ఇతరులు రికార్డ్స్ తారుమారు చేసేందుకు అవకాశం లేని రీతిలో నిర్వహించబడుతుందన్నారు. ∗ భూయాజమాన్య హక్కుల్లో జరిగే మార్పులు, చేర్పులు ఎప్పటికప్పుడు రికార్డ్స్ నందు నమోదవుతూ ఇతర కార్యాలయాల చుట్టూ తిరుగు సమస్యను తొలగించేందుకు ఉపయోగపడుతుందన్నారు. భూయాజమాన్య హక్కులకు సంబందించిన మార్పులు చేర్పులన్నీ నిర్ధారిత కాలవ్యవధిలో నమోదు చేస్తుందని పేర్కొన్నారు.∗ హక్కుదారుల భూహక్కులను పరిరక్షిస్తూ, వివాదాలు లేని భూపరిపాలన చేసేందుకే ఉపయోగపడుతుందన్నారు. ∗ ఈ చట్టం ద్వారా రైతులకు, భూయజమాన్యులకు, భూభాగానికి సంబందించి పూర్తి హక్కులు కల్పిస్తుందని పేర్కొన్నారు.∗ ఈ చట్టానికి సంబంధించి ఇంకా రూల్స్ తయారు చేయలేదని, ఈ చట్టం పరిధి (ఏరియాస్ కవర్డ్) ని నిర్ధారించలేదన్నారు. ఈ చట్టంలో డిజిగ్నేట్ చేసిన అధికారులను ఇంకా అపాయింట్ చేయలేదని, ప్రభుత్వం ప్రజల నుంచి సలహాలను,సూచనలను తీసుకొని అవసరమైన మార్పులను, చేర్పులను చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. రూల్స్ తయారు చేసి, కాంపిటెంట్ అథారిటీ అనుమతి పొందిన తర్వాత, ఈ చట్టాన్ని అమలులోకి తీసుకురావడం జరుగుతుందని స్పష్టం చేశారు. ∗ న్యాయవాదుల సంఘాలు, వ్యక్తులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు దాఖలు చేయగా ఆ పిటిషన్లన్నింటినీ విచారించి, ఈ చట్టాన్ని ప్రస్తుతం అమలుపరచడం లేదని తెలిపారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న కేసులను విచారిస్తూ, కొత్త కేసులను కూడా తీసుకోవాల్సిందిగా సివిల్ కోర్టులను ఆదేశించి ఉన్నారన్నారు. ఇంకా రీృసర్వే పూర్తి కాలేదని దేశవ్యాప్తంగా ఈ చట్టంపై ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాతే ఏపి ప్రభుత్వం ఈ చట్టం అమలుపై ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. -
సీఎం జగన్ నేటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారానికి సంబంధించిన ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రాఘురామ్ విడుదల చేశారు. సీఎం జగన్ నేడు మూడు నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు నరసాపురం పార్లమెంట్ పరిధిలోని నరసాపురం స్టీమెర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కనిగిరిలో పామురు బస్ స్టాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. -
అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
అనంతపురం, సాక్షి: జిల్లాలో భారీగా డబ్బుతో కంటెయినర్లు వెళ్తుండడం ఒక్కసారిగా కలకలం రేపింది. హైదరాబాద్ - బెంగళూరు హైవేపై నాలుగు కంటెయినర్లలో వెళ్తున్న భారీ డబ్బును పోలీసులు గుర్తించారు. అయితే ఆ నగదు సస్పెన్స్ కాసేపటికే వీడింది.పామిడి మండలం గజరాంపల్లి దగ్గర హైవేపై నాలుగు కంటెయినర్లను పోలీసులు తనిఖీల్లో భాగంగా అడ్డుకున్నారు. ఆ కంటెయినర్లలో ఒక్కోదాంట్లో రూ.500 కోట్ల చొప్పున రూ.2 వేల కోట్ల దాకా నగదు కనిపించింది. ఎన్నికల కోడ్ అమల దృష్ట్యా కలెక్టర్, సంబంధిత అధికారులతో పాటు ఐటీ అధికారులకు పోలీసులు సమాచారం అందించారు.చివరకు పత్రాల పరిశీలన తర్వాత కొచ్చి(కేరళ) నుంచి హైదరాబాద్కు ఆ కంటెయినర్లు వెళ్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ ఆర్బీఐ బ్రాంచ్లో ఆ నగదును డిపాజిట్ చేసేందుకు ఆ కంటెయినర్లు అధికారికంగానే వెళ్తున్నాయని, క్షుణ్ణంగా పరిశీలించాక ఆ కంటెయినర్లను ముందుకు వెళ్లేందుకు అనుమతించినట్లు పామిడి సీఐ రాజశేఖర్రెడ్డి మీడియాకు వివరించారు. -
ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
ఎన్టీఆర్, సాక్షి: రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి(AP CEO) ఎంకే మీనా అన్నారు. గురువారం సాయంత్రం పోలింగ్ ఏర్పాట్లపై ఈసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.నామినేషన్ల ఉప సంహరణ తర్వాత తుది అభ్యర్థుల జాబితా సిద్ధం అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,13,33,702 ఓటర్లు ఉన్నారు. గతంతో పోలిస్తే 5,94,631 మంది ఓటర్లు పెరిగారు. వీరిలో పురుషులు 2,02,74,144 మంది. మహిళా ఓటర్లు 2,10,56,137 మంది. అదనంగా సర్వీస్ ఓటర్లు 68,185 మంది ఉన్నారు. ఇక రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ కోసం 46,389 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశాం అని తెలిపారాయన.ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఇప్పటిదాకా 864 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. సీ విజిల్ యాప్కి 16,345 ఫిర్యాదులు వచ్చాయి. కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. ఇద్దరు మృతి చెందగా..156 మందికి గాయాలు అయ్యాయి. ఇప్పటి వరకు రూ.203 కోట్ల విలువైన నగదు, మద్యం సీజ్ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 29,897 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ అంటే.. దాదాపు 64% పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ చేయబోతున్నాం. అలాగే రాష్ట్రంలోని 14 నియోజక వర్గాల్లో 100శాతం వెబ్ కాస్టింగ్ చేయాలని నిర్ణయించాం. మాచర్ల, పెదకూరపాడు ఒంగోలు, అల్లగడ్డ్ , తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్ళపల్లి ల్లలో వంద శాతం వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం. పెరిగిన అభ్యర్థుల కారణంగా అదనం గా 15 వేల బ్యాలెట్ యూనిట్ లు అవసరం అయ్యాయి. వీటిని తెప్పించి జిల్లాకు పంపించాం.ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అందుకే పోలింగ్ కేంద్రాల వద్ద నీడ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే.. మెడికల్ కిట్లు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 28 వేల మంది హోమ్ ఓటింగ్ కు సమ్మతి తెలిపారు. ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హోమ్ ఓటింగ్ మొదలు పెట్టాం.జనసేన పోటీ చేస్తున్న లోక్ సభ, శాసన సభ నియోజకవర్గాల పరిధుల్లో ఎవరికీ గ్లాస్ గుర్తు కేటాయించలేదు. ఇప్పటికే కేటాయించిన 7 లోక్ సభ, 8 శాసన సభ నియోజక వర్గాల్లో గుర్తు ను మార్పు చేసి ఇతర అభ్యర్థులకు ఇచ్చాం అని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా తెలిపారు.
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
Lok sabha elections 2024: లాలూ వర్సెస్ రోహిణి!
ESI scam: అవినీతి మరక.. అచ్చెన్నకు ఎరుక
వేడుకునేది ఓటర్ని కాదు! సూర్యుడ్ని!!
సాంఘిక విప్లవ నాయకుడు
Association for Democratic Reforms: మూడో విడతలో... మహిళలు 9 శాతమే
ఆనందంతో డైరెక్టర్ని హత్తుకున్నాను: సుహాస్
జాలీ రైడ్
జయరాం.. రాం!
ఆ ఒక్కటీ అడక్కు చూసి నవ్వుకుందాం: అడివి శేష్
Lok sabha elections 2024: మూడో దశలో మహా ఫైట్
Photos
View allVideo
View allతప్పక చదవండి
- జయరాం.. రాం!
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- పవన్కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
Advertisement