అన్నాడీఎంకేకు చెందిన వెబ్సైట్ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. అందులో పాకిస్థాన్ జిందాబాద్ వంటి నినాదాలు పొందుపరిచారు. దీంతో ఆ వెబ్సైట్ సేవలను తాత్కాలికంగా నిలిపేశారు.విచారణ కు సైబర్ క్రైం రంగంలోకి దిగింది.సాక్షి, చెన్నై: వె బ్సైట్ల మీద ఆధారపడే వారి సంఖ్య ఆధునిక యుగంలో పెరిగింది. సమాచార మార్గాలుగా అనేక వెబ్సైట్లు మారాయి. ఈ అవకాశాల్ని రాజకీయ పార్టీలు అందిపు చ్చుకున్నాయి. ప్రభుత్వ, ప్రరుువేటు రంగ సం స్థలకు సంబంధించిన వెబ్సైట్లు కోకొల్లలుగా ఆన్లైన్లో ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని రాజకీ య పార్టీలకూ అధికారిక వెబ్సైట్లు ఉన్నాయి. వీటి ద్వారా తమ సమాచారం, సంక్షేమ కార్యక్రమాలు, సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నారుు. గుర్తు తెలియని వ్యక్తులు తరచూ వెబ్సైట్ల హ్యాకింగ్కు పాల్పడుతున్నారు. ఇటీవల చెన్నై పోలీసు కమిషనరేట్ వెబ్సైట్ హ్యాకింగ్ కు గురైంది. దీనికి పాల్పడ్డ వారెవరో ఇంత వరకు గుర్తించలేదు. ఈ పరిస్థితుల్లో అధికార పక్షానికి చెందిన వెబ్సైట్ సైతం హ్యాక్ కావ డం చర్చనీయాంశంగా మారింది.
విచారణ ప్రారంభం:అన్నాడీఎంకే నేతృత్వంలో ఏఐఏడీఎంకే ఆల్ ఇండియా.ఆర్గ్ వెబ్సైట్ ఉంది. ఇందులో పార్టీ కార్యక్రమాలు, ఫొటో లు, వివరాలను ఎప్పటికప్పుడు పొందుపరుస్తున్నారు. ఈ వెబ్సైట్ రెండు రోజుల క్రితం హ్యాక్ కావడాన్ని ఆ పార్టీ వర్గాలు గుర్తించాయి. అందులో పాకిస్థాన్ జెండాతో కూడిన పుర్రె బొమ్మను, పాకిస్థాన్ జిందాబాద్, ఇస్లాం జిందాబాద్ వంటి నినాదాల్ని పొందుపరిచారు. తమకు న్యాయం కావాలని, శాంతి కావాలని అందుకే హ్యాక్ చేశామంటూ ప్రకటించి ఉన్నారు. ఈ విషయూన్ని అన్నాడీఎంకే నేతలు చెన్నై పోలీసు కమిషనర్ జార్జ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సైబర్ క్రైం రంగంలోకి దిగింది. అలాగే క్రైం బ్రాంచ్ సైతం విచారణ చేపట్టింది. వెబ్సైట్ సేవల్ని తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఈ వెబ్సైట్ను ఎక్కడి నుంచి హ్యాక్ చేశారు, దీని వెనుక ఎవరున్నారనే విషయూలపై విచారణ సాగుతోంది.
అన్నాడీఎంకే వెబ్సైట్ హ్యాక్
Published Tue, Nov 5 2013 3:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
డీప్ ఫేక్ బారిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్!
బీజేపీకి ఆదరణ పెరుగుతోంది
విద్యతోపాటు సంస్కారం ప్రధానం
పోలింగ్ను నిశితంగా పరిశీలించాలి
ఎన్నికల వేళ తనిఖీలు ముమ్మరం
ప్రచార పాట్లు
ఎన్నికల నిబంధనలు పాటించాలి
ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి
గ్యారంటీలు అమలైతే ఓట్లడగం
ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement