సాక్షి, ముంబై: గణేశ్ ఉత్సవాలపై బాంబే హైకోర్టు ఆంక్షలు విధించడంతో ఉట్టి ఉత్సవాలు నిర్వహణ ప్రశ్నార్థకమైంది. వాహనాల రాకపోకలకు, బాటసారులకు ఇబ్బందులు కలగకుం డా మండపాలు ఏర్పాటు చేసే గణేశ్ ఉత్సవ మండళ్లకే అనుమతివ్వాలని బృహన్ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ)ని బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలు ఉట్టి ఉత్సవాలకు కూడా వర్తిస్తాయి. అయితే ఉట్టి ఉత్సవాలు ఎక్కువ శాతం రోడ్లపైనే జరుగుతుండటంతో వాటి నిర్వహణపై మండళ్లు, రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఏటా ముంబైతోపాటు తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో సుమారు 10 వేల చోట్లకుపైగా ఉట్టి ఉత్సవాలు ఏర్పాటు చేస్తా రు. దాదర్, వర్లీ, లాల్బాగ్, పరేల్లో అత్యధిక శాతం రహదారులపైనే జరుగుతాయి. రైల్వే స్టేషన్ల బయట, మార్కె ట్ పరిసరాల్లోనూ ఉట్టి ఉత్సవాలు భారీగా జరుగుతాయి. ఇందులో 90 శాతం రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే వే ఉంటాయి. కోర్టు విధించిన ఆం క్షల వల్ల నేతలు ‘వెయిట్ అండ్ సీ’ అనే ధో రణిలో ఉన్నట్లు తెలిసింది. కోర్టు ఆంక్షలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉట్టి ఉత్సవాలు ఆధారపడి ఉంటాయని నిర్వాహకులు భావిస్తున్నా రు.
18 ఏళ్లలోపు పిల్లలకు నిషేధం
ఉట్టి ఉత్సవాల్లో అందజేసే బహుమతులు, పారితోషకాల కోసం ప్రజలు ఎంతకైనా తెగిస్తున్నారు. తొమ్మిది, పది అంతస్తుల ఎత్తు మానవ పిరమిడ్లు నిర్మించేందుకు ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ఫలితంగా ప్రతిసారి ఉత్సవాల్లో కొందరు చనిపోవడం, వికలాంగులుగా మారడం వంటివి చోటుచేసుకుంటున్నాయి. దీనిపై సీరియస్ స్పందించిన బాంబే హైకోర్టు ఉట్టి ఉత్సవాల్లో 18 ఏళ్లలోపు పిల్లలు పాల్గొనడంపై నిషేధం విధించింది.
అలాగే వాహన రాకపోకలకు, ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఉత్సవాలకు అనుమతినివ్వకూడదని తాజాగా ఆంక్షలు విధించింది. హైకోర్టు ఆంక్షల నేపథ్యంలో సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని ఇటీవల గణేశ్, ఉట్టి ఉత్సవ సార్వజనిక మండళ్ల ప్రతినిధులు ముఖ్యమంత్రికి వినతి పత్రాలు అందజేశారు. రాష్ర్ట ప్రభుత్వ నిర్ణయంతోనే ఉత్సవాలు ఆధారపడి ఉం టాయని నిర్వాహకులు అంటున్నారు.
‘ఉట్టి’ కొట్టేదెలా..?
Published Mon, Jul 20 2015 12:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement