పాత ఇంటి గోడను పడగొడుతుండగా ప్రమాదవశాత్తు శిథిలాల కింద పడి ఇద్దరు చని పోయారు.
గోడ కూలి ఇద్దరు మృత్యువాత
Oct 27 2016 11:26 AM | Updated on Sep 4 2017 6:29 PM
భీమవరం : పాత ఇంటి గోడను పడగొడుతుండగా ప్రమాదవశాత్తు శిథిలాల కింద పడి ఇద్దరు చని పోయారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం దొంగపిండి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బొడ్డు రాములు(65) గురువారం తన ఇంటిని పడగొట్టేందుకు గ్రామానికే చెందిన బొడ్డు నాగరాజు(45)ను కూలీగా పెట్టుకుని పని ప్రారంభించాడు. గోడను కూల్చుతుండగా ఒక్కసారిగా గోడ కూలి వారిపై పడింది. శిథిలాల కింద పడి తీవ్రంగా గాయపడిన వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలిని పరిశీలించి, కేసు దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Advertisement