రెండు ఆటోలు ఢీ: ఇద్దరి దుర్మరణం | 2 killed in road accident at mahabab nagar | Sakshi
Sakshi News home page

రెండు ఆటోలు ఢీ: ఇద్దరి దుర్మరణం

Nov 16 2016 10:53 AM | Updated on Oct 8 2018 5:07 PM

మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

భూత్పూర్ : మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్తమొల్గర గ్రామ శివారులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డారు. ప్రయాణికులను తీసుకెళుతున్న రెండు ఆటోలు ఎదురెదురుగా వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement